NIA Raids: ముంబైలో సోదాలు… దావూద్ ఇబ్రహీంతో లింకులపై విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉండీ అనుచరులుగా చలామణీ అవుతున్న వ్యక్తుల ఇళ్లలో నేషనల్ ఇన్వేస్టిగేషన్ ఎజెన్సీ (ఎన్ఐఏ) సోదాలు నిర్వహిస్తోంది. నిన్న ముంబై వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. మొత్తంగా 29 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ముంబైలోని నాగ్ పాడ, గోరేగావ్, బోరివళి, శాంటాక్రూజ్, ముంబ్రాలోని పలువురు దావూద్ ఇబ్రహీం అనుచరుల ఇళ్లలో సోదాలు చేశారు. హవాలా ఆపరేటర్స్, రియల్ ఎస్టేట్, డ్రగ్ ట్రాఫికర్స్ నేరాలకు పాల్పడుతూ… దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణ ఉన్న వారి ఇళ్లపై ఎన్ఐఏ దాడులు నిర్వహించింది. తాజాగా ఆరోజు దావూద్ తో సంబంధం ఉందనే ఆరోపణలపై 15 మందిని ఎన్ఐఏ విచారణకు పిలిచింది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి అరెస్ట్ లు చేయలేదు.
మనీలాండరింగ్ కేసు, దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో గతంలో ఎన్సీపీ నేత, ప్రస్తుతం శివసేన సర్కార్ లో మంత్రిగా ఉన్న నవాబ్ మాలిక్ ను ఈడీ అరెస్ట్ చేసి జైలుకు తరలించింది. దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ తో నవాబ్ మాలిక్ నగదు లావాదేవీలు జరిపినట్లు ఈడీ ఆరోపించింది. అయితే ఈ అరెస్ట్ రాజకీయంగా జరిగిందనే ఆరోపణలు చేశారు శివసేన, ఎన్సీపీ నేతలు. కావాలనే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఈడీ, ఎన్సీబీ, ఎన్ఐఏ వంటి సెంట్రల్ ఏజెన్సీలను ఉపయోగిస్తోందని మహావికాస్ అఘాడీ ప్రభుత్వంలో ఉన్న పార్టీలు ఆరోపిస్తున్నాయి. నవాబ్ మాలిక్ అరెస్ట్ పై అధికార శివసే, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు, బీజేపీ పార్టీలకు మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు చోటు చేసుకున్నాయి.
Also Read
- NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Gig Workers Strike: "పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి".. మళ్లీ సమ్మె బాట పట్టిన గిగ్ వర్కర్లు..
- VD Satheesan: 'సీఎం ఇలా ఏడవకూడదు..' గురువు భార్య వద్ద కాబోయే సీఎం భావోద్వేగం..!
ప్రస్తుతం పాకిస్తాన్ కరాచీలో ఉన్న దావూద్ ఇబ్రహీం తన అనుచరులతో ఇండియాలో మనీలాండరింగ్, ఉగ్రవాద నేరాలకు పాల్పడుతున్నాడు. కరాచీ నుంచే తన నెట్ వర్క్ ను ఆపరేట్ చేస్తున్నాడు. 1993 ముంబై బ్లాస్ట్ లతో దావూద్ ఇబ్రహీంకు సంబంధాలు ఉన్నాయి. ఈ పేలుళ్లలో ప్రధాన సూత్రధారుడిగా దావూద్ ఇబ్రహీం, డీ కంపెనీ ఉంది. అయితే అప్పటి నుంచి దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ లో రాజభోగాలు అనుభవిస్తున్నాడు. ఏకంగా పాక్ ఆర్మీనే దావూద్ ఇబ్రహీంకు రక్షణ కల్పిస్తుంది.
తాజావార్తలు
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
-
CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
-
Sanjay Manjrekar: హార్దిక్ చాప్టర్ క్లోజ్? ముంబై ఇండియన్స్కు అతడే కరెక్ట్ కెప్టెన్ అంటున్న మాజీ స్టార్
-
Veera Bhadrudu OTT: సూర్య ‘వీర భద్రుడు’ ఓటీటీ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..