Site icon NTV Telugu

IND vs NZ: కోహ్లీ పోరాటం వృధా.. ఇండోర్‌లో టీం ఇండియా ఓటమి

Ind Vs Nz

Ind Vs Nz

భారత్- న్యూజిలాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా నేడు ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో చివరి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 41 పరుగుల తేడాతో ఓడిపోయింది. వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్ వడోదరలో జరిగింది, అక్కడ భారత జట్టు నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. ఆ తర్వాత కివీస్ రాజ్‌కోట్ వన్డేను ఏడు వికెట్ల తేడాతో గెలుచుకుని సిరీస్‌ను 1-1తో సమం చేసింది. మూడో వన్డేలో న్యూజిలాండ్ 41 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. న్యూజిలాండ్ 37 సంవత్సరాల తర్వాత భారతదేశంలో ODI సిరీస్‌ను గెలుచుకుంది.

Exit mobile version