Nepal Crisis: ఆకలి, దాహం, భయం.. నేపాల్ నుంచి భారత్ కు నడిచి వచ్చిన కార్మికుల కథ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nepal Crisis: నేపాల్ ప్రస్తుతం తీవ్ర గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటోంది.సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై నిషేధం తర్వాత చెలరేగిన జనరల్ జెడ్ విప్లవం ప్రభుత్వాన్ని కూలదోసింది. అవినీతికి వ్యతిరేకంగా జరిగిన ఈ ఉద్యమం కారణంగా.. నేపాల్ వీధుల్లో హింస, అల్లర్లు, అనిశ్చితి నెలకొన్నాయి. దీని అతిపెద్ద ప్రభావం ఉపాధి కోసం నేపాల్ నగరాలు, పట్టణాలకు వెళ్లి.. పనిచేస్తున్న భారతీయ కార్మికులపై పడింది. రోజు రోజుకూ పరిస్థితి దిగజారడంతో కార్మికులు భారత్ కు కాలినడకన తిరిగి రావడం ప్రారంభించారు.
READ MORE: Off The Record: కవిత అక్కడ నుంచే సొంత రాజకీయ యాత్ర మొదలవుతుందా..?
Also Read
శుక్రవారం బీహార్ రాష్ట్రం బాగాహాలోని వాల్మీకినగర్ గండక్ బ్యారేజ్ చెక్పోస్ట్ వద్ద కార్మికుల పొడవైన క్యూలు ఉన్నాయి. వారందరూ నేపాల్ నుంచి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భారత్ కు తిరిగి వచ్చిన వాళ్లు. ప్రతి కార్మికుడిని SSB జవాన్లు క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే భారత్ లోకి అనుమతించారు. ఆ కార్మికుల అలసిపోయిన అడుగులు, వారి ముఖాల్లో కనిపించే భయం అక్కడిని పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నాయి. కొందరు చేతిలో చిన్న బ్యాగ్ ను పట్టుకుని నిస్సాయంగా నడుస్తూ వస్తున్నారు. మరికొందరు తమ పిల్లను చంకనేసుకుని సొంత దేశానికి చేరుకున్నారు. మహిళలు, వృద్ధులు కూడా కాలినడకన తిరిగి రావాల్సి వచ్చింది.
READ MORE: Crypto Currency Scam: నకిలీ క్రిప్టో కరెన్సీ కేసులో మాజీ కార్పొరేటర్ అరెస్ట్.. ఏ పార్టీ అంటే..?
ఈ సందర్భంగా కొందరు కార్మికులు జాతీయ మీడియా సంస్థతో మాట్లాడారు. తాము నేపాల్ లోని బుత్వాల్లో పనిచేస్తున్నామని చెప్పారు. అక్కడ ఒక్కసారిగా పరిస్థితి మారిపోయిందని.. తమ వేతనాలు ఆగిపోయాయని తెలిపారు. ఆహార కొరత తీవ్రంగా ఏర్పడిందని.. చాలా రోజులుగా తమకు సరైన ఆహారం దొరకలేదని వాపోయారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భయంతో కాలినడకన సరిహద్దుకు చేరుకున్నామని అలసిపోయిన స్వరంతో చెప్పారు. ఈ కార్మికుల దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బు కూడా దారిలో ఖర్చయింది. చాలా మంది ఖాళీ కడుపులతో నడవాల్సి వచ్చింది. మహిళలు, పిల్లల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. సరిహద్దుకు చేరుకున్న వెంటనే కార్మికులు ఊపిరి పీల్చుకున్నారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!