Jail Love Story: జైల్లో ఖైదీల మధ్య ప్రేమ.. వివాహం చేసుకోవడానికి 15 రోజుల పెరోల్ మంజూరు చేసిన కోర్టు
- రాజస్థాన్ జైలులో మొదలైన ప్రేమకథ ఇప్పుడు పెళ్లి దశకు చేరుకుంటోంది
- ప్రియా సేథ్, హనుమాన్ ప్రసాద్ ఇద్దరూ వేర్వేరు హత్యలకు జైలు పాలయ్యారు
- హంతకులు ప్రియా సేథ్, హనుమాన్ ప్రసాద్ పెళ్లి చేసుకోనున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వాళ్లిద్దరు వేర్వేరు హత్యల్లో దోషులు. ఓ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ సమయంలో వారి మధ్య ప్రేమ చిగురించింది. ఆ ప్రేమ కాస్త పెళ్లికి దారితీసింది. వారు వివాహం చేసుకోవడానికి 15 రోజుల పెరోల్ మంజూరు చేసింది కోర్టు. ఈ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. రాజస్థాన్ జైలులో మొదలైన ప్రేమకథ ఇప్పుడు పెళ్లి దశకు చేరుకుంటోంది. ప్రియా సేథ్, హనుమాన్ ప్రసాద్ ఇద్దరూ వేర్వేరు హత్యలకు జైలు పాలయ్యారు. ప్రియ, హనుమాన్ ప్రసాద్ జైపూర్లోని సంగనేర్ ఓపెన్ జైలులో కలుసుకున్నారు. ప్రేమలో పడ్డారు. ఇప్పుడు రాజస్థాన్ హైకోర్టు అల్వార్లోని బరోడమేవ్లో వివాహం చేసుకోవడానికి 15 రోజుల అత్యవసర పెరోల్ మంజూరు చేసింది. ప్రియ, హనుమాన్ ప్రసాద్ ఈరోజు, శుక్రవారం, జనవరి 23న వివాహం చేసుకోనున్నారు.
Also Read:US-Canada: అమెరికా-కెనడా మధ్య ఉద్రిక్తతలు.. బోర్డ్ ఆఫ్ పీస్ ఆహ్వానాన్ని వెనక్కి తీసుకున్న ట్రంప్
Also Read
- Sugar Price Fall: చక్కెర ధరలపై కేంద్రం మాస్టర్ ప్లాన్.. సామాన్యులకు గుడ్ న్యూస్..
- Operation Sindoor: భారత్ హిట్ లిస్టులో పాకిస్తాన్ ‘‘స్కార్దు’’.. చైనాకు కూడా హెచ్చరికేనా..?
- Egg Prices Rise: గుడ్ల ధరలకు ఇథనాల్ ఎఫెక్ట్.. అసలు కారణం ఇదే!
- Nepal Flash Floods: నేపాల్ వరద ప్రళయం.. బీహార్కు పెను ప్రమాదం..
ఐదుగురిని హత్య చేసిన కేసులో హనుమాన్ ప్రసాద్ జైలులో ఉన్నాడు. అతను నలుగురు పిల్లలను, ఒక యువకుడిని చంపాడు. హనీట్రాప్ చేసి దుష్యంత్ శర్మ అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో ప్రియ సేథ్ (33) యావజ్జీవ శిక్ష అనుభవిస్తోంది. ఐదుగురిని హత్య చేసిన కేసులో హనుమాన్ ప్రసాద్ జైపూర్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అతను తన స్నేహితురాలితో కలిసి ఆమె భర్త బన్వారీ లాల్ను హత్య చేశాడు. హత్యలు జరిగిన ఇంట్లో ప్రసాద్ ముగ్గురు పిల్లలు మరియు మేనల్లుడు కూడా ఉన్నారు. అరెస్టుకు భయపడి, ప్రసాద్ ఆమె ఆదేశం మేరకు, నలుగురు పిల్లలను కత్తితో చంపాడు. 2018లో జరిగిన హత్య కేసులో ప్రియా సేథ్ దోషిగా తేలి జీవిత ఖైదు అనుభవిస్తోంది.
Also Read:Jr NTR : నారా లోకేష్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే విషెష్
గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్న వీరు గతేడాది నవంబర్లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని, తమ కుటుంబాలకు తెలిపారు. డిసెంబర్లో పెరోల్ కోసం రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు. తమ అభ్యర్థనలో భాగంగా కోర్టుకు పెళ్లి పత్రికను కూడా సమర్పించారు. కోర్టు ఆదేశాల మేరకు జిల్లా పెరోల్ సలహా కమిటీ వీరికి పెళ్లి కోసం పెరోల్ మంజూరు చేసింది. హంతకుల మధ్య ప్రేమ పెళ్లి దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
తాజావార్తలు
-
Sugar Price Fall: చక్కెర ధరలపై కేంద్రం మాస్టర్ ప్లాన్.. సామాన్యులకు గుడ్ న్యూస్..
-
Ranabaali: ఇప్పుడు రష్మిక – విజయ్ వంతు.. ఈ వారంలోనే ‘రణబాలి’ బిగ్ సర్ప్రైజ్? అసలు ట్విస్ట్ ఇదే!
-
Operation Sindoor: భారత్ హిట్ లిస్టులో పాకిస్తాన్ ‘‘స్కార్దు’’.. చైనాకు కూడా హెచ్చరికేనా..?
-
Food Facts : పప్పులో తెల్లటి నురుగు.. మురికేనా.? అసలు నిజం ఇదే.!
-
Egg Prices Rise: గుడ్ల ధరలకు ఇథనాల్ ఎఫెక్ట్.. అసలు కారణం ఇదే!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..