Site icon NTV Telugu

Middle East War: ఇరాన్ మిస్సైళ్ల దాడి అలర్ట్‌తో.. ముంబై-దుబాయ్ ఫ్లైట్ డబుల్ రివర్స్ చేసి సేఫ్ ల్యాండింగ్

Flight

Flight

మధ్యప్రాచ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగిన నేపథ్యంలో, ముంబై నుంచి దుబాయ్ వెళ్లే ఎమిరేట్స్ ఫ్లైట్‌కు మిస్సైల్ దాడి అలర్ట్ వచ్చింది. దీంతో ఆ ఫ్లైట్ అరుదైన ‘డబుల్ రివర్స్’ (double reverse) మాన్యువర్ చేసి, చివరికి సురక్షితంగా దుబాయ్‌లో ల్యాండ్ అయింది. ఈ ఘటన మార్చి 3, 2026 ఉదయం జరిగింది. ఎమిరేట్స్ ఫ్లైట్ EK501 ముంబై నుంచి బయలుదేరి దుబాయ్ వైపు వెళ్తుండగా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి బాలిస్టిక్ మిస్సైళ్ల దాడి గురించి అలర్ట్ వచ్చింది.

Also Read:Iran Israel War: ‘‘చాలా ఆలస్యమైంది’’.. ఇరాన్ నాశనమైపోయిందన్న ట్రంప్..

ఇరాన్ నుంచి దాడులు జరుగుతున్నాయని, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ యాక్టివ్‌గా ఉన్నాయని సమాచారం అందింది. ఫ్లైట్‌రాడార్24 డేటా ప్రకారం, ఫ్లైట్ UAE ఎయిర్‌స్పేస్‌లోకి ప్రవేశించే ముందు బయటే ఆపేశారు. దీంతో పైలట్లు మొదట ముంబై వైపు తిరిగి వెళ్లేలా టర్న్ తీసుకున్నారు. తర్వాత మళ్లీ దుబాయ్ వైపు మళ్లీ మళ్లీ దిశ మార్చారు. ఇదే ‘డబుల్ రివర్స్’ అని ఏవియేషన్ నిపుణులు, ఫ్లైట్ ట్రాకర్లు వర్ణిస్తున్నారు. ఇలాంటి మాన్యువర్ చాలా అరుదుగా జరుగుతుంది, ముఖ్యంగా ఇంత తీవ్రమైన భద్రతా పరిస్థితుల్లో.

Also Read:Garika: గ్రహణ సమయంలో ఇంట్లో అన్నిటి మీద గరిక గడ్డి ఎందుకు పెడతారు?.. దీని వెనుక అసలు కారణాలు ఇవే!

చివరికి ఎయిర్‌స్పేస్‌లో కొంత సమయం హోల్డింగ్ చేసిన తర్వాత, ఫ్లైట్ సురక్షితంగా దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయింది. ఈ ఘటన ఫ్లైట్ ట్రాకింగ్ మ్యాప్‌లలో వైరల్ అయింది, మధ్యప్రాచ్య యుద్ధం వల్ల సివిలియన్ ఎవియేషన్‌పై ఎలాంటి ప్రభావం పడుతుందో చూపిస్తోంది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో UAEలో ఎయిర్‌స్పేస్ రెస్ట్రిక్షన్స్, ఫ్లైట్ క్యాన్సిలేషన్లు, డైవర్షన్లు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎమిరేట్స్, ఎటిహాద్ వంటి ఎయిర్‌లైన్స్ ప్రత్యేక ఫ్లైట్లు నడుపుతున్నాయి. కానీ పరిస్థితి ఇంకా అస్థిరంగా ఉంది. ప్రయాణికులు ఈ రీజియన్‌కు వెళ్లేటప్పుడు ఎయిర్‌లైన్ అప్‌డేట్స్, ట్రావెల్ అడ్వైజరీలను గమనించాలని సూచనలు వస్తున్నాయి.

Exit mobile version