మృణాల్ ఠాకూర్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు.. ఒక్క సినిమాతోనే అందరి చూపును తనవైపు తిప్పుకుంది.. సీతారామం సినిమాలో చాలా పద్దతిగా ఉన్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రాళ్లకు మతి పోగొడుతుంది.. రోజూ రోజుకు అందాల ప్రదర్శనకు బౌండరీలు చేరిపేస్తుంది.. తాజాగా బ్లాక్ డ్రెస్సులో కిల్లింగ్ పోజులతో హాట్ ఫోటోలను షేర్ చేసింది.. అవి కాస్త ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.. ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి..సీతారామం’ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ నెట్టింట అందాల సునామీ సృష్టిస్తోంది.. అంతేకాదు వరుస సినిమాలలో నటిస్తుంది..
ప్రస్తుతం ఈ అమ్మడు పేరు ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలోనూ మృణాల్ వరుసగా పోస్టులు పెడుతూ మరింత హాట్ టాపిక్ గా మారుతోంది. మరోవైపు మృణాల్ చేస్తున్న ఫొటోషూట్లు స్టన్నింగ్ గా ఉంటున్నాయి. గ్లామర్ షోలో నెక్ట్స్ లెవల్ అనిపిస్తోంది.. బ్యాక్ ఎంబ్రాయిడర్ త్రీ పీసెస్ డ్రస్ ధరించింది. ఆ డ్రస్పై సీక్విన్స్ ఎంబ్రాయిడరీ మృణాల్కి మంచి లుక్ ఇచ్చింది. దానికి తగ్గట్లు తనిష్క్ మల్హోత్రా బ్రాండ్ గోల్డెన్ చెవిపోగులను, బ్రాస్లెట్ని ధరించింది.. ఆమె ధరించిన బ్లాక్ వెస్టర్న్ డ్రస్ ప్రఖ్యాత బ్రాండ్ మిశ్రుకు చెందింది.. దీని ధర అక్షరాల రూ. 88,000. ఇందులో ఏముంది అంత ధర అని ఆశ్చర్యపోతున్నారా.. ఏదైనా సెలెబ్రేటీలు రిచ్ గా ఉంటారు..
ఇక సినిమాల విషయానికొస్తే.. రెండు భారీ సినిమాల్లో ఛాన్స్ లు అందుకుందని తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరోలు అజిత్, శింబు సరసన అవకాశాలు అందుకుందట మృణాల్. ఇటీవల విడుదలైన మార్క్ ఆంటోని చిత్రం ఫేమ్ ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అజిత్ చేస్తున్నారు. ఈ సినిమాలో మృణాల్ ను హీరోయిన్ గా అనుకుంటున్నారట. ఈ సినిమా ఛాన్స్ వస్తే అమ్మడు రేంజ్ పూర్తిగా మారిపోతుంది.. శివకార్తికేయన్ మురగదాస్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో మృణాల్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తోంది. ఈ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. తెలుగుతో పాటు తమిళ్ ఇండస్ట్రీలోనూ బిజీగా అయిపొయింది మృణాల్.. మొత్తానికి సీత బాగా బిజీ అయ్యింది..