Rape Case: ఆరేళ్ల బాలికపై అత్యాచారం.. కామాంధుడిపై పోలీసుల కాల్పులు..
Rape Case: మధ్యప్రదేశ్లోని రైసెన్ జిల్లాలోని గౌహర్గంజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో 6 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచారం ఘటన మొత్తం రాష్ట్రాన్ని ఆగ్రహానికి గురిచేసింది. నవంబర్ 21వ తేదీ శుక్రవారం రాత్రి, ఓ కామాంధుడు బాలికపై అత్యాచారాని ఒడిగట్టాడు. దీంతో బాలిక పరిస్థితి విషమంగా మారింది. ఈ సంఘటన జరిగిన వెంటనే నిందితుడు పరారయ్యాడు. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ విస్తృతంగా నిరసనలు జరిగాయి. దీంతో పోలీసుల అప్రమత్తమయ్యారు. సంఘటన జరిగిన ఏడవ రోజున నిందితుడు సల్మాన్ అలియాస్ నాజర్ను అరెస్టు చేశారు. భోపాల్లోని గాంధీనగర్లో అరెస్టు చేసిన.. రైసెన్కు తరలిస్తుండగా కిరాత్ నగర్ గ్రామం సమీపంలో నిందితుడు పారిపోవడానికి ప్రయత్నించాడు. దీంతో పోలీసులు నిందితుడిపై కాల్పులు జరిపారు.
READ MORE: Anantapur Crime: అనంతపురంలో దారుణం.. డిప్యూటీ తాహసీల్దార్ భార్య, కుమారుడు మృతి!
Also Read
- Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
- MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
- Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
- KKR Vs SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరో విజయానికి బ్రేక్..? కేకేఆర్లోకి స్టార్ ప్లేయర్ ఎంట్రీ..
అయితే.. నిందితుడు సల్మాన్పై పోలీసుల రూ.30 వేల బహుమతి ప్రకటించారు. దీంతో భోపాల్లోని గాంధీనగర్ వార్డ్ నంబర్ 11లో ఒక టీ స్టాల్ వద్ద సల్మాన్ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. టీ తాగడానికి స్టాల్కు వచ్చిన సల్మాన్ను పోలీసులు వెంటనే పట్టుకున్నారు. అవసరమైన ప్రక్రియలు పూర్తి చేసిన తర్వాత, గాంధీనగర్ పోలీసులు సల్మాన్ను గోహర్గంజ్ పోలీసులకు అప్పగించారు. గోహర్గంజ్ పోలీసులు నిందితుడిని తీసుకుని పోలీస్ స్టేషన్కు బయలుదేరారు. దీంతో వారి వాహనం పంక్చర్ అయింది. పోలీసులు దిగి సరి చేస్తుండగా.. నిందితుడు తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో పోలీసులు నిందితుడిపై కాల్పులు జరిపారు. కాలుకు బుల్లెట్ గాయం అయింది. అక్కడి నుంచి భోపాల్లోని జేపీ ఆసుపత్రికి తరలించారు. ఇంతలో, సల్మాన్ అరెస్టు గురించి తెలుసుకున్న జై మా భవానీ హిందూ సంస్థ కార్యకర్తలు పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు.. అత్యాచారానికి గురైన బాలిక పరిస్థితి విషమంగా ఉంది. ఎయిమ్స్ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బాలికకు తక్షణ శస్త్రచికిత్స జరిగింది. ఆమె శరీరం తీవ్రంగా నలిగి పోయింది. అనేక సంక్లిష్ట చికిత్సలు జరిగాయి. బాలిక పూర్తిగా కోలుకోవడానికి చాలా నెలలు పడుతుందని వైద్యులు అంచనా వేస్తున్నారు. దాదాపు మూడు నెలల్లో మరో శస్త్రచికిత్స అవసరం కావచ్చునని పేర్కొన్నారు. ప్రస్తుతం, బాలిక పరిస్థితి కొంతవరకు స్థిరపడుతుందని భావిస్తున్నారు.
READ MORE: Maharashtra: బీజేపీ-శివసేన మధ్య విభేదాలు! కూటమి నిలబడేనా?
తాజావార్తలు
-
Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
-
Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
-
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!