Site icon NTV Telugu

Moinabad Farmhouse Drugs Case: మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కొత్త కోణం..

Moinabad

Moinabad

Drugs Party: ఫార్మ్ హౌస్ డ్రగ్స్ కేస్ లో కొత్త కోణం వెలుగు చూసింది. ఫార్మ్ హౌస్ పార్టీలో నిందితులు మూడు రకాల డ్రగ్స్ వాడినట్లు సిట్ బృందం గుర్తించింది. కోకేన్, ఎండిఎంఏ డ్రగ్స్ వాడినట్లు గుర్తించింది. ముఖ్యంగా నమిత్ శర్మ మూడు రకాలు వాడినట్లు నిర్ధారించారు. పైలట్ రోహిత్ రెడ్డి రెండు రకాల డ్రగ్స్ వాడినట్లు అధికారులు తేల్చారు. ఇక అర్జున్ రెడ్డితో పాటు మిగిలిన నిందితులు ఎండిఎంఏతో పాటు మేతోతిపెన్ వాడినట్లు తెలిపారు. పోలీసులు అధిక కిక్ కోసం రోహిత్ నమిత్ శర్మ కాస్ట్లీ మద్యంతో పాటు డ్రగ్స్ కలిపి తీసుకున్నట్లు గుర్తించారు పోలీసులు.

Dhurandhar 2 : ‘ధురంధర్ 2’ ఇండియాలో 6 నిమిషాల సీన్లు కట్.. వయోలెన్స్‌పై బోర్డు సీరియస్!

పార్టీకి సిమ్లా నుంచి కౌశిక్ డ్రగ్స్ తీసుకొచ్చినట్లు నిర్ధారించారు అధికారులు. అభిషేక్ నుంచి రెండు రకాల డ్రగ్స్ కొనుగోలు చేశాడు. పైలట్ డ్రైవర్ రోహిత్ ఓఆర్ఆర్ దగ్గర కొనుగోలు చేసినట్లు తేల్చారు.అడ్వకేట్ కౌశిక రవి తాను బిజినెస్ ట్రిప్ కోసం సిమ్లాకి వెళ్ళినప్పుడు అక్కడికి గుర్తు తెలిన వ్యక్తుల దగ్గర నుంచి దాదాపు 15,000 రూపాయలు చెల్లించి తీసుకొని వచ్చినట్లుగా పేర్కొన్నారు. అయితే మిగతా డ్రగ్స్ మిగతా రెండు రకాల డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అనే విషయం తెలుసుకున్నప్పుడు పైలట్ రోహిత్ డ్రైవర్ అయిన శరత్ ఈ రెండు రకాల డ్రగ్స్ తెచ్చినట్లుగా అధికారులు గుర్తించారు.

India New Airline Rules: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఫ్లైట్ టికెట్ బుకింగ్‌లో కొత్త రూల్స్..

Exit mobile version