Site icon NTV Telugu

Moinabad Drugs Case: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో బిగ్ ట్విస్ట్.. వెలుగులోకి ప్రముఖ వ్యక్తి పేరు..

Moinabad Drugs Case Twist

Moinabad Drugs Case Twist

Moinabad Drugs Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలన సృష్టించిన మొయినాబాద్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి కేసులో కేదార్ పేరు తెరమీదకు వచ్చింది. గతేడాది డ్రగ్స్ ఓవర్డోస్‌తో దుబాయ్‌లో కేదార్ మరణించాడు. కేదార్‌తో రోహిత్‌రెడ్డి బ్రదర్స్‌కు దగ్గరి సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రోహిత్‌రెడ్డి కేదార్‌కు మధ్య అనేక లావాదేవీలు ఉన్నాయని తేల్చారు. చాలామంది డ్రగ్ పార్టీ నిర్వాహకులకు అనేక సార్లు డబ్బులు పంపినట్టు ఆధారాలు సేకరించినట్లు వివరించారు. రోహిత్ రితీష్ బ్యాంక్ ఖాతా నుంచి కేదార్‌కు రూ. 25 లక్షలు రూపాయలు లావాదేవీ ఉన్నట్లు గమనించారు. ఈ రూ. 25 లక్షలు గురించి కూడా విచారించామని పోలీసుల వెల్లడించారు. కేదార్‌తో లావాదేవీల గురించి అడిగినప్పుడు రోహిత్ రెడ్డి, రితేష్ పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని వివరించారు. కస్టడీ పొడిగింపు పిటిషన్‌లో ఈ అంశాలను పోలీసులు పేర్కొన్నారు.

READ MORE: Massive Explosion in Kadiri: కదిరిలో భారీ పేలుడు.. నలుగురు అక్కడికక్కడే మృతి.. 12 మందికి సీరియస్‌..

ఇదిలా ఉండగా..ఈ డ్రగ్స్‌ కేసు బయటకు వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు మూలాలను, అంతర్జాతీయ సంబంధాలను ఛేదించేందుకు ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. రాజేంద్రనగర్ డీసీపీ యోగేశ్ గౌతమ్ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇర రంగంలోకి దిగిన స్పెషల్ టీమ్ డ్రగ్స్ పార్టీకి ఎవరెవరు హాజరయ్యారు..? అక్కడ డ్రగ్స్ సరఫరా ఎలా జరిగింది..? దీని వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా..? అనే కోణంలో విచారణ చేపడుతోంది. ఈ డ్రగ్స్ దందాతో దుబాయ్‌కు ఉన్న సంబంధాలపై కూడా సిట్ ఆరా తీసింది. ఇక ఒక్కొక్కటిగా అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Exit mobile version