Mohammed Siraj: ఫలితానికే కాదు… గుణపాఠాల కోసం గుర్తుండిపోతాయి కొన్ని మ్యాచ్లు.. సిరాజ్ ఎమోషనల్ పోస్ట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohammed Siraj: ఇంగ్లాండ్తో లార్డ్స్లో జరిగిన మూడవ టెస్ట్ మ్యాచ్ భారత్కి చేదు ఫలితాన్ని ఇచ్చింది. ఇకపోతే, ఈ మ్యాచ్ లో చివరి వికెట్ గా బౌల్డ్ అయిన భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ మాత్రం భావోద్వేగంతో అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. కేవలం 22 పరుగుల తేడాతో టీమిండియా ఓడిపోయిన ఈ మ్యాచ్ అనంతరం, సిరాజ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక సందేశాన్ని పోస్ట్ చేశాడు. అదేంటంటే..
Also Read
“కొన్ని మ్యాచ్లు ఫలితం కోసం కాకుండా, అవి మనకు నేర్పిన పాఠాల కారణంగా మనతోనే ఉంటాయి” అంటూ సిరాజ్ రాసిన ఈ పోస్ట్ లో తన ఎమోషన్ ను పంచుకున్నాడు. లార్డ్స్ టెస్ట్ మొత్తం హోరాహోరీగా సాగింది. రెండు జట్లు గెలుపుకోసం తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరి రోజు లంచ్ సమయానికే ఎనిమిది వికెట్లు కోల్పోయిన భారత్, మూడో సెషన్లో కొంత పోరాడినప్పటికీ, చివరకు మహ్మద్ సిరాజ్ వికెట్ కోల్పోవడంతో మ్యాచ్ ముగిసింది.
Read Also:Lowest total in Tests: టెస్టుల్లో అత్యల్ప స్కోర్ చేసిన చేసిన జట్లు ఇవే..!
ఈ సమయంలో ఇంగ్లాండ్ బౌలర్లు తమ ఉత్తమ ప్రదర్శనను కనబరిచారు. భారత్ చివరి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ విఫలమవడంతో మ్యాచ్ వాళ్లవైపు మళ్లిపోయింది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత జో రూట్, జాక్ క్రాలీ సిరాజ్ దగ్గరికి వచ్చి ఓదార్చిన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అయింది. టెస్టు సిరీస్లో ఈ విజయంతో ఇంగ్లాండ్ జట్టు 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. అయినప్పటికీ, భారత జట్టు ప్రదర్శనపై విమర్శలతో పాటు సపోర్టింగ్ వ్యాఖ్యలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా మహ్మద్ సిరాజ్ వేసిన స్పెల్లు, అతని ఎనర్జీ మ్యాచ్కి కొత్త ఉత్సాహం తీసుకువచ్చాయి. ఇక నాలగవ టెస్ట్ జులై 23 నుండి మొదలు కానుంది.
తాజావార్తలు
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
-
New Country: ఐసీసీ సభ్యత్వం పొందిన మరో దేశం.. మొత్తం 111కు చేరిన సంఖ్య..
-
OTR: ఆరు నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జ్లు.. తూర్పుగోదావరిపై చంద్రబాబు ప్రత్యేక ఫోకస్..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!