Mohammed Shami: దేశం కోసం నిరంతరం శ్రమిస్తా.. షమీ భావోద్వేగ పోస్టు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో రెండో అత్యున్నత క్రీడా పురస్కారం ‘అర్జున అవార్డు’ను టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ అందుకున్న విషయం తెలిసిందే. మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అర్జున అవార్డు అందుకొన్నాడు. వన్డే ప్రపంచకప్ 2023లో అత్యున్నత ప్రదర్శన చేసినందుకు గాను షమీకి ఈ అవార్డు దక్కింది. ప్రపంచకప్లో 7 మ్యాచులలో 24 వికెట్లు సాధించాడు. భారత క్రికెట్ జట్టులో అర్జున అవార్డు అందుకున్న వారిలో షమీ 58వ క్రికెటర్. అవార్డు అందుకున్న అనంతరం షమీ ఎక్స్లో భావోద్వేగ పోస్టు పెట్టాడు. అభిమానులకు ఎల్లవేళలా రుణపడి ఉంటానాని, దేశం గర్వపడేలా చేసేందుకు తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి నిరంతరం శ్రమిస్తానని షమీ పేర్కొన్నాడు.
‘ఈ నిమిషం ఎంతో గర్వపడుతున్నా. రాష్ట్రపతి గారు నన్ను ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డుతో సత్కరించారు. నేను ఈ స్థాయికి చేరుకోవడానికి సహకారం అందించిన ప్రహతిఒక్కరికి ధన్యవాదాలు. కెరీర్లో ఒడిదొడుకులు చవిచూసిన సమయంలో చాలా మంది అండగా నిలిచారు. కోచ్, బీసీసీఐ, సహచరులు, నా ఫామిలీ, స్టాఫ్ సహకారం వెల కట్టలేనిది. నా అభిమానులకు ఎప్పుడూ రుణపడి ఉంటా. నా శ్రమను గుర్తించి ఈ అవార్డును అందించినందుకు కృతజ్ఞతలు. దేశం గర్వపడేలా చేసేందుకు నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి నిరంతరం శ్రమిస్తా’ అని మహమ్మద్ షమీ ట్వీట్ చేశాడు.
Also Read
- Vaibhav Sooryavanshi: రికార్డుల మోత మోగిస్తున్న సూర్యవంశీ.. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు..
- Trump: “వాళ్లు మన మధ్యే తిరుగుతున్నారు”.. ఏలియన్స్ వెబ్సైట్ ప్రారంభించిన వైట్హౌస్
- Anti-Ageing Plan: అమరత్వం కోసం పుతిన్ భారీ ప్లాన్.. ఏం చేస్తున్నాడంటే..
- Iran-US: ఇరాన్ యురేనియం నిల్వలపై షాకింగ్ నివేదిక.. అమెరికా ఏం చేయబోతోంది?
Also Read: Virat Kohli: బాబర్ అజామ్ను అధిగమించిన విరాట్ కోహ్లీ.. సత్తా చాటిన రోహిత్ శర్మ!
ప్రస్తుతం టీమిండియాలో ఉన్న క్రికెటర్లలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అజింక్యా రహానే, ఆర్ అశ్విన్, ఛతేశ్వర్ పుజారా, రవీంద్ర జడేజాలు అర్జున అవార్డు అందుకున్నారు. టీమిండియా స్టార్ సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, రవిశాస్త్రి, మహ్మద్ అజారుద్దీన్, సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే, జవగళ్ శ్రీనాథ్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వగ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్లతో పాటు మిథాలీ రాజ్, జులన్ గోస్వామి, హర్మన్ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, పూనమ్ యాదవ్, దీప్తి శర్మలు కూడా అర్జున అవార్డు అందుకున్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: రికార్డుల మోత మోగిస్తున్న సూర్యవంశీ.. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు..
-
Honor X80: 10,000mAh భారీ బ్యాటరీతో హానర్ X80 వచ్చేస్తోంది.. పవర్ఫుల్ ఫీచర్లు హైలైట్!
-
Jagapathi Babu: “నాకు యాక్టింగ్ తప్ప ఇంకేం రాదు.. ఆ విషయంలో నేను జీరో”: జగపతి బాబు
-
Kitchen Hacks : మిక్సీ జార్ వేడెక్కుతుందా..? ఈ చిన్న తప్పే మసాలా రుచి పాడుచేస్తోంది.!
-
Trump: “వాళ్లు మన మధ్యే తిరుగుతున్నారు”.. ఏలియన్స్ వెబ్సైట్ ప్రారంభించిన వైట్హౌస్
ట్రెండింగ్
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?