NTV Telugu Site icon

Mohamed Muizzu: రాష్ట్రపతి భవన్‌లో మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజు..

Pm Modi

Pm Modi

Mohamed Muizzu: మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజు నాలుగు రోజుల భారత పర్యటన కోసం ఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు ఆయన సతీమణి సాజిదా మహమ్మద్ కూడా భారత్‌లో పర్యటించనున్నారు. అధ్యక్షుడు ముయిజ్జూ పాలంలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ ఆయనకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ స్వాగతం పలికారు. ఆ తరువాత, ముయిజు రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. అక్కడ అతనికి ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వాగతం పలికారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మహ్మద్ ముయిజు తమ దేశాల మంత్రులను ప్రతినిధులకు పరిచయం చేశారు.

Also Read: Mayank Yadav: నువ్వేం ప్రత్యేకంగా చెయ్యొద్దన్నాడు.. అసలు విషయం చెప్పిన మయాంక్‌ యాదవ్!

భారత మంత్రులకు పరిచయం చేసిన తర్వాత, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ మాల్దీవుల ప్రతినిధులతో సమావేశమయ్యారు. దీని తరువాత, అధ్యక్షుడు ముయిజు రాజ్‌ఘాట్‌కు చేరుకుని మహాత్మా గాంధీకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ సమయంలో ఆయన సతీమణి సాజిదా మహమ్మద్ కూడా ఆయనతో ఉన్నారు. ఇకపోతే భారత్‌లో మహ్మద్ ముయిజుకు ఇదే తొలి ద్వైపాక్షిక పర్యటన. మహ్మద్ ముయిజు భారత పర్యటన గురించి విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలుపుతూ…, ఈ పర్యటన భారత్, మాల్దీవుల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తుందని అలాగే దేశాల మధ్య సహకారాన్ని పెంచుతుందని పేర్కొంది.

CPI Narayana: ప్రధాని మోడీ విదేశీ పర్యటన.. సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు