PM Modi Japan Visit: మోడీ జపాన్ పర్యటన.. అణుదాడిలో మరణించిన వారికి నివాళి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi Japan Visit: జీ7 సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా మోడీ జపాన్ వెళ్లారు. తొలిరోజు మోడీ బిజీబిజీగా గడిపారు. హిరోషిమాలో జాతి పిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం జీ7 దేశాల సమావేశంలో పాల్గొని మోదీ ప్రసంగించారు. యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీతోనూ మోదీ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధం ఏడాదిగా కొనసాగుతున్న యుద్ధ పరిష్కారానికి భారత్ కృషి చేస్తుందని మోదీ హామీ ఇచ్చారు. రెండోరోజు జపాన్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.హిరోషిమాలో దాదాపు 78ఏళ్ల క్రితం అణుబాంబు దాడి జరిగింది. ఆ ప్రదేశానికి ప్రధాని మోదీ జీ7 దేశాల నాయకులతో కలిసి సందర్శించారు.
Read Also:Surya Stotra: ఈ స్తోత్ర పారాయణం చేస్తే ఏ సమస్యలు మీ దరి చేరవు
Also Read
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ఈ సందర్భంగా హిరోషిమా పీస్ మెమోరియల్ వద్ద అణుబాంబు దాడిలో మరణించిన వారికి నివాళులర్పించారు. ఆ తరువాత పీస్ మెమోరియల్ మ్యూజియాన్ని సందర్శించారు. అక్కడ డాక్యుమెంట్ చేయబడిన ఎగ్జిబిట్ లను పరిశీలించి, సందర్శకుల పుస్తకంపై మోదీ సంతకం చేశారు. ప్రధాని మోదీతో పాటు పీస్ మెమోరియల్ మ్యూజియాన్ని సందర్శించిన వారిలో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా కూడా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ రెండోరోజు హిరోషిమాలో మోడీ పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. బ్రిటీష్ ప్రధాని రిషి సునాక్ ను కలుస్తారు. ఆ తర్వాత భారతదేశ పసిఫిక్ దీవుల సహకార సదస్సులో పాల్గొనడానికి పాపువా న్యూ గినియాకు మోదీ బయలుదేరి వెళ్తారు. ఇదిలాఉంటే శనివారం యుక్రెయిన్ అధ్యక్షుడు జలెన్ స్కీ ప్రధాని నరేంద్ర మోదీకి ఓ విజ్ఞప్తి చేశారు. యుక్రెయిన్ దేశాన్ని సందర్శించాలని ఆయన కోరారు.
Read Also:Thunderstorm and Rain: ఏపీకి వర్ష సూచన.. ఈ జిల్లాల్లో పిడుగులు..!
తాజావార్తలు
-
Samantha Ruth Prabhu : ‘మా ఇంటి బంగారం’ హీరోయిన్ సాయి పల్లవా ? ఆ ఛాన్స్ సామ్ ఎలా కొట్టేసిందంటే ?
-
Vivo V70 Lite: వివో V70 లైట్ విడుదల.. 6500mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, 6.77 అంగుళాల FHD+ AMOLED డిస్ప్లే
-
Astrology: డబ్బు విషయంలో ఈ 3 రాశులవారు చాలా జాగ్రత్త.. ఖర్చు పెట్టే ముందు పదిసార్లు ఆలోచిస్తారట!
-
Veerappan Interview Controversy : వీరప్పన్ కేసులో హీరోయిన్ కు బిగ్ రిలీఫ్… ఆ ఛానల్ భారీ పరిహారం చెల్లించాల్సిందే.!
-
Suryakumar-Shreyas: చాలా సంతోషంగా ఉంది.. సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం.. సూర్య సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!