Modi G20 Initiatives: G20 సమ్మిట్లో ప్రధాని మోడీ మూడు ‘గేమ్ ఛేంజర్’ ఇనిషియేటివ్లు.. ప్రపంచ వేదికపై దుమ్మురేపిన భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Modi G20 Initiatives: 20 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా దక్షిణాఫ్రికాలో జీ 20 శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. ఈ జీ–20 శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ అభివృద్ధి నమూనాలపై కొత్తగా ఆలోచించే సమయం వచ్చిందని స్పష్టం చేశారు. ‘సమగ్ర, స్థిరమైన ఆర్థిక వృద్ధి – ఎవరూ వెనుకపడకూడదు’ అనే అంశంపై మోడీ మాట్లాడారు. ఇప్పటి వరకు అవలంభించిన గ్లోబల్ గ్రోత్ విధానాలు అనేవి పెద్ద సంఖ్యలో ప్రజలకు వనరులు అందకుండా చేయడం మాత్రమే కాకుండా, ప్రకృతి దోపిడీకి దారితీసి ప్రపంచానికి కొత్త సవాళ్లను సృష్టించాయని పేర్కొన్నారు. ఈ సమస్యలు ఆఫ్రికా వంటి ప్రాంతాల్లో మరింత తీవ్రంగా కనిపిస్తున్నాయని ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రపంచ సమగ్రాభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ప్రధాని మోడీ జీ–20 వేదికపై మూడు కీలక కార్యక్రమాలను ప్రతిపాదించారు.. అవి ఏమిటంటే..
READ ALSO: Hyderabad: హైదరాబాద్లో బీభత్సం.. కర్రలు, కత్తులతో నడిరోడ్డుపై గ్యాంగ్ వార్ !
Also Read
- Minister Satya Kumar: కొత్త పార్టీ పెట్టుకో.. కానీ ముందు ప్రజలకు ఆ లెక్క చెప్పు..
- Mallikarjun Kharge: ఫలించిన కాంగ్రెస్ పోరాటం.. ఖర్గే ర్యాలీ తర్వాత శుద్ధి చేసిన ఘటనపై ఎఫ్ఐఆర్
- Putin: బ్రిక్స్కు ముందే ఢిల్లీకి వస్తున్న పుతిన్.. కారణమిదే!
- PM Modi: మోడీ ముంబై టూర్లో కలకలం.. ఇద్దరు అనుమానితుల నుంచి నకిలీ ID, తుపాకీ స్వాధీనం!
* గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపోజిటరీ
ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సమాజాలు శతాబ్దాలుగా పర్యావరణ సమతుల్యత, సాంస్కృతిక సంపద, సామాజిక ఐక్యతను కాపాడే జీవన శైలులను అనుసరిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ విలువైన జ్ఞానం అనేది భవిష్యత్ తరాలకు అందేలా ‘గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపోజిటరీ’ ను జీ–20 ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని సూచించారు. భారతదేశం చేపట్టిన ఇండియన్ నోలెడ్జ్ సిస్టమ్స్ (IKS) ఈ ప్లాట్ఫారమ్కు బలమైన పునాది అవుతుందని నరేంద్ర మోడీ వెల్లడించారు.

* జీ–20.. ఆఫ్రికా స్కిల్స్ మల్టిప్లయర్ ఇనిషియేటివ్
ఆఫ్రికా పురోగతి ప్రపంచ అభివృద్ధికి అత్యంత కీలకం అని ప్రధాని మోడీ వెల్లడించారు. ఈ దిశగా ‘G20–Africa Skills Multiplier’ కార్యక్రమాన్ని మోడీ ప్రతిపాదించారు. ఇది ట్రైన్-ది-ట్రైనర్స్ మోడల్పై ముందుకు వెళ్తుందని చెప్పారు. జీ–20 దేశాలు కలిసి దీనికి ఆర్థిక సహకారం అందిస్తాయని వెల్లడించారు. రాబోయే పదేళ్లలో ఆఫ్రికాలో ఒక మిలియన్ సర్టిఫైడ్ ట్రైనర్లను తయారు చేయడం ఈ కార్యక్రమం లక్ష్యంగా మోడీ అభివర్ణించారు. వీరి ద్వారా కోట్లాది యువతకు నైపుణ్యాలు అందించవచ్చని ఆయన చెప్పారు.

* డ్రగ్–టెర్రర్ నెక్సస్ను అడ్డుకునే జీ–20 కలెక్టివ్ ఇనిషియేటివ్
ప్రపంచ వ్యాప్తంగా ఫెంటనిల్ వంటి ప్రాణాంతక సింథటిక్ మాదక ద్రవ్యాలు వేగంగా వ్యాపిస్తున్నాయని, ఇవి ప్రజారోగ్యం, సామాజిక స్థిరత్వం, ప్రపంచ భద్రతను తీవ్రమైన ప్రమాదంలో పడేస్తున్నాయని భారత ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ‘G20 Initiative on Countering the Drug–Terror Nexus’ ను ఏర్పాటు చేయాలని ఆయన ప్రతిపాదించారు. దీనివల్ల డ్రగ్ మాఫియా–టెర్రరిస్ట్ నెట్వర్క్లను అణచివేయడానికి ఆర్థిక, పాలన, భద్రతా రంగాల్లో సమగ్ర చర్యలు తీసుకోవచ్చని వెల్లడించారు. అక్రమ నిధుల ప్రవాహాలను అడ్డుకోవడం, తీవ్రవాదానికి నిధులు అందే మార్గాలను మూసివేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని మోడీ తెలిపారు.

తాజావార్తలు
-
Pan India Star: పాన్ ఇండియా కూడా పాతదైపోయిందా? హీరోలకు నెక్ట్స్ ట్యాగ్ ఏంటి?
-
Minister Satya Kumar: కొత్త పార్టీ పెట్టుకో.. కానీ ముందు ప్రజలకు ఆ లెక్క చెప్పు..
-
KTR : రేవంత్ సర్కార్పై కేటీఆర్ సంచలన కామెంట్స్..
-
Mallikarjun Kharge: ఫలించిన కాంగ్రెస్ పోరాటం.. ఖర్గే ర్యాలీ తర్వాత శుద్ధి చేసిన ఘటనపై ఎఫ్ఐఆర్
-
Harish Rao : 1000 రోజులు.. హామీలు ఎక్కడ? హరీశ్ రావు బిగ్ కౌంటర్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!