PM Modi: కాంగ్రెస్ ఉగ్రవాదులకు మద్దతు ఇస్తుంది: మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: అస్సాంలో పర్యటిస్తున్న ప్రధాని మోడీ ఆదివారం దరంగ్ జిల్లాలోని మంగళ్డోయ్లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. “కాంగ్రెస్ పార్టీ భారత సైన్యానికి కాదు, పాకిస్థాన్ పెంచి పోషించిన ఉగ్రవాదులకు, జాతి వ్యతిరేక శక్తులకు మద్దతు ఇస్తుంది” అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా అస్సాంను పాలించిందని, కానీ బ్రహ్మపుత్ర నదిపై “కేవలం మూడు వంతెనలు” మాత్రమే నిర్మించిందని విమర్శించారు. అదే బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం గత 10 ఏళ్లలో అలాంటి ఆరు నిర్మాణాలను నిర్మించిందని ప్రధాని పేర్కొన్నారు. ఆ పాత పార్టీ చొరబాటుదారులను, దేశ వ్యతిరేక శక్తులను రక్షిస్తోందని అన్నారు. చొరబాటుదారులు భారత్ భూమిని ఆక్రమించుకోవడానికి, జనాభాను మార్చడానికి చేసే కుట్రలను బీజేపీ అనుమతించదని ప్రధాని స్పష్టం చేశారు.
READ ALSO: Raghava Lawrence : వాళ్లపై నోట్ల వర్షం కురిపించిన లారెన్స్.. ఎందుకంటే..
Also Read
- Pakistan: పాక్లో తిరుగుబాటు భయం..! బొద్దింకలు ఏకమైతే అన్నీ తలకిందులే.. యువతపై హోం మంత్రి సంచలన వ్యాఖ్యలు
- Jinping: భారత్ పర్యటనకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్.. వచ్చేదెప్పుడంటే..!
- Ambati Rambabu నారా లోకేష్ అక్రమాలకు పాల్పడ్డారు.. డీఎస్సీ పోస్టులు అమ్ముకున్నారు!
- Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో 'పే లేటర్' సదుపాయం!
‘కాంగ్రెస్ పార్టీ ‘ఆపరేషన్ సింధూర్’ సమయంలో, పాకిస్థాన్లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నాశనం చేసిన దేశ సాయుధ దళాలకు మద్దతు ఇవ్వడానికి బదులుగా, చొరబాటుదారులను, దేశ వ్యతిరేక శక్తులను రక్షించడంలో నిమగ్నమై ఉంది’ అని ప్రధాని విమర్శించారు. కామాఖ్య మాత ఆశీస్సుల వల్ల ‘ఆపరేషన్ సింధూరం’ విజయవంతమైందని, ఈ పవిత్ర భూమిపై ఉండటం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు.
నెహ్రూ చేసిన గాయాలు మానలేదు..
“1962లో చైనా దురాక్రమణ సమయంలో జవహర్లాల్ నెహ్రూ అస్సాం ప్రజలపై చేసిన గాయాలు ఇంకా మానలేదు” అని ప్రధాని పేర్కొన్నారు. ఆక్రమిత భూమి నుంచి చొరబాటుదారులను తరిమికొట్టి, రైతులు ఇప్పుడు ఈ భూములలో సాగు చేసుకునేలా చేసిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మను ప్రధాని ప్రశంసించారు. భారతరత్న అవార్డు గ్రహీత భూపేన్ హజారికాను కాంగ్రెస్ అవమానించినందుకు బాధపడినట్లు ప్రధాని పేర్కొన్నారు. వారి కలలను సాకారం చేయడానికి బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కట్టుబడి ఉంది స్పష్టం చేశారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా భారతదేశం ఎదుగుతోందని, అస్సాం వృద్ధి రేటు 13 శాతంగా ఉందని అన్నారు.
కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం అస్సాంను ఆరోగ్య కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నాయి అన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రధాని మంగళ్డోయ్లో రూ.6,300 కోట్ల విలువైన ఆరోగ్య, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అలాగే దరంగ్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ నిర్మాణాన్ని, నర్సింగ్ కాలేజీ, GNM స్కూల్ భవనాలను ప్రారంభించారు. అనంతరం 1,200 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 2.9 కి.మీ. పొడవైన నరేంగి-కురువా వంతెనకు, అస్సాంలోని కామరూప్, దరంగ్ జిల్లాలను, మేఘాలయలోని రి భోయ్ను కలిపే 118.5 కి.మీ. పొడవైన గౌహతి రింగ్ రోడ్ ప్రాజెక్టుకు కూడా ప్రధాని శంకుస్థాపన చేశారు.
READ ALSO: Israel: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ ఈ ముస్లిం దేశమేనా?..
తాజావార్తలు
-
Omar Abdullah Divorce: విడిపోయిన సీఎం దంపతులు.. 17 ఏళ్ల ఎడబాటుకు సుప్రీంకోర్టు ముగింపు!
-
Pakistan: పాక్లో తిరుగుబాటు భయం..! బొద్దింకలు ఏకమైతే అన్నీ తలకిందులే.. యువతపై హోం మంత్రి సంచలన వ్యాఖ్యలు
-
Anil Ravipudi: త్రివిక్రమ్ను అనిల్ రావిపూడి డామినేట్ చేసేశాడా?
-
Jinping: భారత్ పర్యటనకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్.. వచ్చేదెప్పుడంటే..!
-
GMB, AVD, ART తర్వాత.. NTR పేరు కూడా చేరబోతోందా? సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా ఎన్టీఆర్!
ట్రెండింగ్
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!
-
24 క్యారెట్ బంగారంతో లగ్జరీ టచ్.. Caviar నుంచి ప్రత్యేక ఎడిషన్ల స్మార్ట్ ఫోన్స్ లాంచ్.!