Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. ఐదు రోజుల పాటు మోస్తరు వర్షాలు..
- బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం..
- తెలుగు రాష్ట్రాలకు వర్ష హెచ్చరిక జారీ..
- తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు వర్షాలు పడే అవకాశం..
- రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వాతావరణం చల్లబడడమే కాకుండా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. తాజాగా వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు వర్ష హెచ్చరిక జారీ చేసింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నైరుతి రుతుపవనాలు, ద్రోణి ప్రభావంతో ప్రస్తుతం రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉపరితల ఆవర్తన గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వీటి ప్రభావంతో ఐదు రోజుల పాటు తెలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మహబూబ్ నగర్, జోగుళాంబ గద్వాల, నల్గొండ, నారాయణపేట్, యాదాద్రి, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, మెదక్, జగిత్యాల, నిర్మల్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.
Read also: Telugu Indian Idol: సరికొత్త బెంచ్మార్క్ సెట్ చేసిన తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3
Also Read
- IND Vs IRE: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. తుది జట్టు ఇదే..
- Vaibhav Sooryavanshi: వైభవ్కు మళ్లీ నిరాశ.. టీమిండియాలోకి ఇద్దరు కొత్త ప్లేయర్స్ ఎంట్రీ..
- Cancer: వంశంలో ఎవరికైనా క్యాన్సర్ చరిత్ర ఉంటే.. తర్వాత తరం వారికి వస్తుందా..? నివారణ ఇలా..
- Yogi Adityanath: మొహర్రంలో కత్తులతో అల్లర్లు చేసే రోజులు పోయాయి.
ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉదయం నుంచి వాతావరణం మేఘావృతమై సాయంత్రం వరకు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏపీ విషయానికి వస్తే ఉపరితల ద్రోణి ప్రభావంతో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో అక్కడక్కడా వర్షపాతం నమోదైంది. ఉత్తరాంధ్ర, కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతామరాజు, అనకాపల్లి, కాకినాడ, ఉభయగోదావరి జిల్లాలు, నెల్లూరు, ఏలూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో ఉరుములతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిడుగులు పడే అవకాశం ఉందని.. చెట్లకింద ఎవరూ ఉండకూడదన్నారు.
Hyderabad Crime: హైదరాబాద్ లో షాకింగ్ ఘటన.. ట్రైన్ కు వేలాడుతూ మృతదేహం..
తాజావార్తలు
-
IND Vs IRE: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. తుది జట్టు ఇదే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్కు మళ్లీ నిరాశ.. టీమిండియాలోకి ఇద్దరు కొత్త ప్లేయర్స్ ఎంట్రీ..
-
Cancer: వంశంలో ఎవరికైనా క్యాన్సర్ చరిత్ర ఉంటే.. తర్వాత తరం వారికి వస్తుందా..? నివారణ ఇలా..
-
Yogi Adityanath: మొహర్రంలో కత్తులతో అల్లర్లు చేసే రోజులు పోయాయి.
-
Iran: 30 రోజుల్లో హార్ముజ్ తెరుచుకుంటుంది, కానీ కండిషన్స్ అప్లై..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!