హైదరాబాద్ లోని ఎంఎంటీఎస్ రైళ్ల ప్రయాణికులకు ఓ అలర్ట్… ఈ నెల 25, 26 తేదీల్లో పలు ఎంఎంటీఎస్ రైళ్లు, 4 డెమో సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన చేసింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సంబంధించిన ఆధునీకరణ పనుల నేపధ్యం, ఫుట్ ఓవర్ బ్రిడ్జిల లాంటి నిర్మాణ పనుల వల్ల పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు తెలిపింది.
Satyabhama: “క్యాలిక్యులేషన్స్ ఉండవు.. కేవలం ఎమోషన్స్ ఉంటాయి..” బాలయ్యపై కాజల్ కామెంట్స్..
ఇక ఇందులో, సికింద్రాబాద్ – ఫలక్నుమా, మేడ్చల్ – సికింద్రాబాద్, లింగంపల్లి – మేడ్చల్, హైదరాబాద్ – మేడ్చల్ మధ్య సేవలందించే 22 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు చీఫ్ పీఆర్వో సీహెచ్. రాకేశ్ ఓ ప్రకటనలో తెలిపారు.
Satyabhama Trailer: నటసింహం బాలయ్య చేతుల మీదుగా “సత్యభామ” ట్రైలర్ రిలీజ్..
ఇక వీటితో పాటు సిద్దిపేట – సికింద్రాబాద్ ల మధ్య సర్వీసులందించే 4 డెమూ రైళ్లను కూడా రద్దు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అందులో కొన్ని రైళ్లను కేవలం రెండు రోజుల పాటు, మరికొన్నింటిని ఒక్కరోజు మాత్రమే సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ప్రకటనలో ఆయన తెలిపారు.