Miss World 2025: మిస్ వరల్డ్ నుంచి నందిని గుప్తా నిష్క్రమణ..
- హైటెక్స్లో కొనసాగుతున్న మిస్ వరల్డ్ ఫైనల్స్..
- పోటీల నుంచి నిష్క్రమించిన మిస్ ఇండియా నందిని గుప్తా
- టాప్ 5 నుంచి ఇద్దరిని షార్ట్ లిస్ట్ చేస్తున్న నిర్వాహకులు
- ఆసియా నుంచి టాప్ 2లోకి చేరిన థాయ్లాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైటెక్స్లో మిస్ వరల్డ్ ఫైనల్స్ కొనసాగుతున్నాయి. తాజాగా మిస్ వరల్డ్ పోటీల నుంచి మిస్ ఇండియా నందిని గుప్తా నిష్క్రమించారు. ఖండాల వారీగా టాప్ 5 నుంచి ఇద్దరిని షార్ట్ లిస్ట్ చేస్తున్నారు నిర్వాహకులు.. ఆసియా నుంచి టాప్ 2లోకి థాయ్లాండ్ అభ్యర్థి చేరారు. నువ్వు మస్వరల్డ్ అయితే ఏం చేస్తావని అడిగిన ప్రశ్నకు 45 సెకన్లలో మెరుగైన సమాధానం ఇచ్చిన వారికి అవకాశం కల్పించారు.. అభ్యర్థుల సమాధానాలకు జడ్జీల మార్కులు వేసి నిర్ణయిస్తారు. ఈ నేపథ్యంలో నందిని గుప్తా నిష్క్రమణకు గురైనట్లు తెలుస్తోంది. కాగా.. విజేతకు రూ. 8.5 కోట్ల నగదు, 1770 వజ్రాల కిరీటం, ఏడాది పాటు ఉచితంగా ప్రపంచ యాత్ర కల్పిస్తారు. ఈ పోటీలో ఒకవేళ గెలిచి ఉంటే.. అత్యధిక టైటిళ్ల విజేతగా భారత్ రికార్డు సృష్టించేది. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి.. సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, రానా, విజయ్దేవరకొండ, ఖుష్బూ హాజరయ్యారు.
READ MORE: Acharya pramod krishnam: రాహుల్ గాంధీకి పాకిస్తాన్లో ఫుల్ క్రేజ్, అక్కడ పోటీ చేస్తే గెలుస్తాడు..
Also Read
- Palak Pakoda Recipe: సింపుల్గా ఇంటి వద్దే కరకరలాడే పాలక్ పకోడాలు.. ఇలా రెడీ తయారు చేయండి..
- West Bengal Politics: మమతా పార్టీలో ‘‘షిండే’’ రాజకీయాలు.. తృణమూల్లో తీవ్ర సంక్షోభం..
- Trump: ‘ఐ లవ్ ఇండియా.. ఐ లవ్ మోడీ’’ సోషల్ మీడియాలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. ఆసక్తి రేపుతోన్న కామెంట్స్
- YS Jagan: అందుకే "మావిగన్" ప్రతిపాదన.. స్పష్టం చేసిన జగన్
మిస్ వరల్డ్ విజేతను ఎలా ఎంపిక చేస్తారంటే..
మూడు దశల్లో జరిగే క్వార్టర్ ఫైనల్స్లో ఒక్కో ఖండం నుంచి 10 మందిని ఎంపిక చేస్తారు. అమెరికా, కరీబియన్స్ నుంచి 10 మంది, ఆఫ్రికా నుంచి 10 మంది, ఐరోపా నుంచి 10 మంది, ఏషియా, ఓషీనియా నుంచి 10 మందిని సెలెక్ట్ చేస్తారు. ప్రతి ఖండం నుంచి ఎంపికైన 10 మంది నుంచి సెకెండ్ స్టేజ్లో ఐదుగురిని ఎంపిక చేయనున్నారు. మళ్లీ ఈ ఐదుగురిలో మూడో దశలో ఇద్దరిని ఎంపిక చేస్తారు. ఇలా పోటీలో 8 మంది నిలువగా.. ఈ 8 మందిలో సెమీ ఫైనల్లో భాగంగా ప్రతి ఖండం నుంచి ఎంపికైన ఇద్దరిలో ఒకరిని టాపర్గా ఫైనలైజ్ చేస్తారు. మిగిలిన నలుగురి మధ్య ఫైనల్ పోటీ జరగనుంది. ప్రస్తుతం ఫైనల్లో నలుగురు నిలిచారు.
నలుగురిలో ఏషియా, ఓషీనియా గ్రూప్ నుంచి భారత్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న నందినీ గుప్తా ఉంది. యూరప్ ఖండం నుంచి మిస్ ఐర్లాండ్ జాస్మిన్ గర్హాట్, ఆఫ్రికా నుంచి నమీబియాకు చెందిన సల్మా కామనియా, అమెరికా కరీబియన్ గ్రూప్ నుంచి మార్టిన్కు చెందిన ఆరెలీ బోచిమ్ ఎంపికయ్యారు. గ్రాండ్ ఫినాలేలో ఈ నలుగురే పాల్గొంటారు. ఈ నలుగురిలోనే ఒకరిని మిస్ వరల్డ్ కిరీటం వరించనుంది. ఇక మిస్ వరల్డ్ విజేతకు రూ.8.5 కోట్ల ప్రైజ్ మనీ అందజేయనున్నారు. మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్, మెయిన్ స్పాన్సర్ల ద్వారా ఈ ప్రైజ్ మనీ అందించనున్నారు.కాగా.. 1951 నుంచి ప్రపంచ సుందరి పోటీల్ని ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు భారత్.. వెనెజువెలా ఆరుసార్లు చొప్పున కిరీటాన్ని సొంతం చేసుకున్నాయి. మన దేశం నుంచి తొలిసారి 1966లో రీటా ఫారియా ప్రపంచ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకోగా.. 1994లో ఐశ్వర్యారాయ్.. 1997లో డయానా హెడెన్.. 1999లో యుక్తాముఖి.. 2000లో ప్రియాంక చోప్రా.. 2017లో మానుషి చిల్లర్ లు విజేతలుగా నిలిచారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ప్రపంచ సుందరి పోటీలు ప్రారంభమైన 15 ఏళ్లకు తొలిసారి భారత్ టైటిల్ సొంతం చేసుకుంటే.. ఆ తర్వాత 28 ఏళ్ల తర్వాత ఐశ్వర్యరాయ్ టైటిల్ ను సొంతం చేసుకుంది. ఆమె విజేతగా నిలిచిన తర్వాత గడిచిన 34 ఏళ్లలో 4 సార్లు భారత్ కు ఈ టైటిల్ దక్కింది. 1994 నుంచి 2000 మధ్యన ఆరేళ్ల వ్యవధిలో నాలుగుసార్లు ప్రపంచ సుందరి టైటిల్ ను భారత్ సొంతం చేసుకుంది. ఇంత స్వల్ప వ్యవధిలో మరే దేశానికి ఇన్ని టైటిళ్లు లభించలేదని చెబుతారు.
తాజావార్తలు
-
Palak Pakoda Recipe: సింపుల్గా ఇంటి వద్దే కరకరలాడే పాలక్ పకోడాలు.. ఇలా రెడీ తయారు చేయండి..
-
West Bengal Politics: మమతా పార్టీలో ‘‘షిండే’’ రాజకీయాలు.. తృణమూల్లో తీవ్ర సంక్షోభం..
-
Trump: ‘ఐ లవ్ ఇండియా.. ఐ లవ్ మోడీ’’ సోషల్ మీడియాలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. ఆసక్తి రేపుతోన్న కామెంట్స్
-
Nepal VS India Explained: భారత్-నేపాల్ మధ్య మళ్లీ మంటలు.. ఈ రాజకీయ భూకంపానికి కారణం ఏంటి?
-
YS Jagan: అందుకే “మావిగన్” ప్రతిపాదన.. స్పష్టం చేసిన జగన్
ట్రెండింగ్
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!