Site icon NTV Telugu

సంగారెడ్డిలో దారుణం : మైనర్ బాలిక కిడ్నాప్

Kidnapping

Kidnapping

సంగారెడ్డి జిల్లాలో దారుణంలో చోటు చేసుకుంది. 7 సంవత్సరాల మైనర్ బాలిక కిడ్నాప్ కలకలం రేపింది. సంగారెడ్డికి చెందిన బాలికను కిడ్నాప్ చేసి జోగిపేట వైపు బైక్ పై తీసుకు వెళ్లారు కొందరు దుండగులు. శివ్వంపేట కల్లు దుకాణంలో కల్లు సేవించేందుకు బాలికను వెంట తీసుకెళ్లారు ఆగంతకులు. చిన్నారి ఏడుస్తుండడంతో అనుమానంతో గ్రామస్థులు ఆగంతకులను నిలదీశారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వినాయక విగ్రహాలను చూపిస్తామంటూ బాలికను నమ్మించి కిడ్నాప్ చేసినట్లు అంగీకరించారు నిందితులు. బాలికను రక్షించి 108 లో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పుల్కల్ పోలీసులు. ప్రస్తుతం పుల్కల్ పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు ఉన్నారు. ఒకరు కంది, మరొకరు సదాశివపేట కు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు.

Exit mobile version