Minister Seethakka: చచ్చిన శవాలకు బీజేపీ టాక్స్ వసూల్ చేసారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Seethakka: చచ్చిన శవాలకు బీజేపీ టాక్స్ వసూల్ చేసారని మంత్రి సీతక్క అన్నారు. భవిష్యత్ బాగుండాలంటే కాంగ్రెస్ ను ఆదరించాలని సూచించారు. పెండింగ్ పనులను అన్నీ పూర్తి చేస్తామన్నారు. జిల్లాను అభివృద్దిలో అగ్రబాగంలో ఉంచుతామన్నారు. దేహాలు ముక్కలు అయినా పర్వాలేదు అని దేశం కోసం పని చేసింది ఇందిరా గాంధీ కుటుంబం అని తెలిపారు. బీజేపి మతాల గురించి తప్ప పనుల గురించి చెప్పరని అన్నారు. మోడీ వచ్చి ఆదిలాబాద్ కు ఏం ఇచ్చారని అని ప్రశ్నించారు. మూత పడ్డ సిసిఐ పరిశ్రమ గురించే మాట్లాడలేదని అన్నారు.
Read also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
Also Read
- Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
- Bangladesh: మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఉగ్రవాదం..
- Khamenei Funeral: ఖమేనీ అంత్యక్రియల్లో "మాస్క్ మ్యాన్".. ఎవరనేది తెలిసింది
- Jagga Reddy : బీఆర్ఎస్ నేతలకు జగ్గారెడ్డి సవాల్.. కేసీఆర్, హరీష్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.!
గ్యారంటిలకే గ్యారంటీ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. పదేళ్లు ఏం చేయకుండా.. బీజేపీకి ఓటు వేస్తే రాష్ట్రాన్ని, మన భవిష్యత్ ను .. విద్య మీద, బట్టల మీద 12 శాతం టాక్సీ వేసిందన్నారు. పేదలను మరింత పేదలను చేసిందని మండిపడ్డారు. ప్రజలను తల్చుకుంటే ఎవ్వరిని ఎక్కడ కూర్చో బెట్టాలో అక్కడ కూర్చోబెడతారని క్లారిటీ ఇచ్చారు. బీజేపీకి జంతువుల మీద ఉన్న ప్రేమ ప్రజల మీద లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చచ్చిన శవాలకు బీజేపి టాక్స్ వసూల్ చేసారని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ను ఓట్ల తో పక్కన పెట్టిన వారు ఇప్పుడు బీజేపీని పక్కన పెట్టాలని సూచించారు.
Read also: Sobhita Dhulipala: ట్రెండీ డ్రెస్సులో అందాలు ఆరబోస్తున్న శోభితా…
అంతేకాకుండా.. నిన్న పెద్దపల్లిలో పర్యటించిన సీతక్క వచ్చే ఎన్నికల్లో గల్లీ ఎన్నికలు కాదు.. ఢిల్లీ ఎన్నికలు అని మంత్రి సీతక్క అన్నారు. కార్యకర్తలు ఇగోలు పక్కనపెట్టి కలిసికట్టుగా పని చేయాలని, పెద్దపల్లి ఎంపీ సీటును రాహుల్ గాంధీకి కానుకగా ఇవ్వాలని మంత్రి సూచించారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆమె హాజరయ్యారు. గత ప్రభుత్వం వల్ల నిరుద్యోగం పెద్ద ఎత్తున పెరిగిపోయిందని మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. బీటెక్, డిగ్రీలు చదివి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పనులకు సైతం వెళ్తున్నారని తెలిపారు.
Insomnia: నిద్రలేమితో బాధపడుతున్నారా?.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే!
తాజావార్తలు
-
Tirupati Drugs Case : తిరుపతి డ్రగ్స్ కేసులో టీటీడీ ఉద్యోగి అరెస్ట్..
-
Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
-
Bangladesh: మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఉగ్రవాదం..
-
AP CM Chandrababu: ముంబైలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు..
-
Shabad Murders : షాబాద్ హంతకుడు రాజ్కుమార్ వేటలో విస్తుపోయే నిజాలు
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..