NTV Telugu Site icon

Minister Sidiri: పేదలంటే చంద్రబాబుకు కోపం, చిరాకు..

Appalraju

Appalraju

శ్రీకాకుళం జిల్లాలో పలాస సామజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా వైసీపీ బహిరంగ సభలో మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. ప్రభుత్వ స్కూల్ బాగుచేయాలని అలొచన రాలేదు.. పేదలంటే చంద్రబాబు నాయుడికి కోపం, చిరాకు వస్తుందని ఆయన విమర్శించారు. మత్స్యకారుల తొక్కతీస్తాం, తోలుతీస్తామని గతంలో చంద్రబాబు వార్నాంగ్ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. నాయిబ్రాహ్మణుల తోకలు కట్ చేస్తామన్నారు.. బీసీలు జడ్జిలుగా పనికి రారని లెటర్ రాసాడు అని మంత్రి సీదిరి అప్పల రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Nepal Earthquake: నేపాల్‌లో భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

జడ్జీలు కావాలంటే నారా చంద్రబాబు నాయుడి కులంలో పుట్టాలంట అని మంత్రి సీదిరి అప్పలరాజు ఆగ్రహ వ్యక్తం చేశారు. దళితులుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అని అన్నారు.. విద్యా, వైద్యం కార్పొరేట్ మయం చేసి బాబు తన వాళ్లకు కట్టబెట్టుకున్నారు.. ఉద్దానం గోష విని , కిడ్ని జబ్బులతో చెనిపోకూడదని అలోచన చెస్తున్నారు.. 200 కోట్ల రూపాయలతో కిడ్నీ రీసెర్చ్ హాస్పటిల్ కట్టిస్తున్నారు అని ఆయన పేర్కొన్నారు. 700 కోట్ల రూపాయలతో ప్రతి గ్రామానికి కులాయి ద్వారా త్రాగు నీరు అందించే ఏర్పాటు చేస్తున్నారు.. కింజరాపు వాళ్లు జిల్లాకు ఏం చేసారో చెసారో చెప్పాలి అని డిమాండ్ చేశారు. మూల పేటలో వలసల నిర్మూలనకు పోర్ట్ నిర్మిస్తున్నారు అని మంత్రి సీదిరి అప్పల రాజు వెల్లడించారు. ప్రజల కోసం సీఎం జగన్ ఇన్ని చేస్తున్నారు.. ఆయనకు ఓటు వేసి గెలిపించుకోవాలని మంత్రి సీదిరి అప్పలరాజు కోరారు.