NTV Telugu Site icon

Minister Roja: నాపై మాట్లాడినా వారందరూ కాలగర్భంలో కలసిపోయారు..

Roja

Roja

పుత్తూరు మున్సిపల్ ఛైర్మన్‌ పదవి అమ్ముకున్నారనే ఆరోపణలపై మంత్రి ఆర్కే రోజా స్పందించారు. పదేళ్ళుగా ఎక్కడైనా తప్పు చేశాను అనో.. ఒకరి దగ్గర ఒక్క రూపాయి తీసుకున్నానో నిరూపించగలరా అని ప్రశ్నించారు. కాగా.. జగన్ మీదా ఆయన సొంత చెల్లిలే విమర్శలు చేసినప్పుడు.. తనమీద ఎందుకు చేయరని పేర్కొన్నారు. కౌన్సిలర్ భువనేశ్వరికి పదవీ ఇస్తే అమ్ముడుపోయి.. తనపైనే విమర్శిస్తున్నారని మంత్రి తెలిపారు.

Read Also: Congress : ఆరు గ్యారెంటీలు అద్భుతం.. ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ కితాబు

వాళ్ళు చేసే వ్యాపారం ఏంటో కనుక్కోండి.. ఆమెకు కౌన్సిలర్ గా అవకాశం ఇచ్చింది వైసీపీనేనని అన్నారు. భువనేశ్వరికి రాజకీయ అర్హత లేకపోయినా వారికి అవకాశం ఇచ్చామని మంత్రి రోజా తెలిపారు. భువనేశ్వరి ఎప్పుడూ పార్టీ జెండా మోసింది లేదు.. పనిచేసింది లేదని ఆరోపించారు. కృతజ్ఞత లేకుండా దేనికో లొంగి.. తన మీద నింద వేశారని పేర్కొన్నారు. వారికి భగవంతుడు సమాధానం చెబుతాడు.. తనపై మాట్లాడిన వారందరూ కాలగర్భంలో కలసిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Republic Day: ‘దేశ్ రంగీలా’ పాట పాడిన ఈజిప్ట్‌ అమ్మాయి.. ప్రశంసలు కురిపించిన ప్రధాని