నల్గొండ జిల్లాలోని మునుగోడులో గురువారం మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ సమావేశానికి జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మంత్రులు జగదీశ్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్లతో పాటు కేటీఆర్ ఉదయం 11 గంటలకు మునుగోడుకు చేరుకుని అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.
Also Read : Mehbooba Mufti: ముస్లింలను దెయ్యాలుగా చూపించే ప్రయత్నమే “కాశ్మీర్ ఫైల్స్” సినిమా
మునుగోడు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, పట్టణాల సర్పంచ్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, వార్డు కౌన్సిలర్లను సమీక్షా సమావేశానికి పిలిచారు. మునుగోడు ఉప ఎన్నికలకు ముందు జరిగిన ఎన్నికల ప్రచారంలో మంత్రి నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటామని, మునుగోడు అభివృద్ధిపై ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్ష సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. బుధవారం జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణా రెడ్డి సమీక్షా సమావేశ ఏర్పాట్లను పరిశీలించారు.
Also Read : Sandalwood Smuggling: పుష్ప సినిమాను తలపించిన పోలీసుల చేజింగ్.. భారీగా ఎర్రచందనం దుంగలు స్వాధీనం
