Minister Jogi Ramesh: 2022 వైసీపీకి విజయనామ సంవత్సరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2022 వైసీపి ప్రభుత్వానికి విజయ నామ సంవత్సరం అన్నారు ఏపీ గృహ నిర్మాణ శాఖా మంత్రి జోగి రమేష్. అన్ని వర్గాలకు ఆనందం నింపిన సంవత్సరం. ఏ ఎన్నిక జరిగినా విజయ పరంపరతో గెలిచిన సంవత్సరం అన్నారు జోగి రమేష్. మా లీడర్ జగన్ నాయకత్వంలో 2022 విజయ నామ సంవత్సరం. ఇదే 2022 చంద్రబాబు కు బూతుల నామ సంవత్సరంగా మారిందన్నారు. ప్రతి ఎన్నికల్లో ఆఖరికి చంద్రబాబు అడ్డా కుప్పం మున్సిపాలిటీతో సహా ఘోరంగా ఓడి పోయిన సంవత్సరం ఇదే అన్నారు జోగి రమేష్. చంద్రబాబు, లోకేష్, అయ్యన్నపాత్రుడు నుంచి దత్తపుత్రుడు వరకు 2022 బూతుల సంవత్సరం అయిందన్నారు.
మళ్ళీ మా బీసీలంతా ఇస్త్రీ చేసుకుంటూ, మగ్గాలు నేయాలని చెప్తారా ? జగనేమో మా బీసీలంతా ఉన్నతస్థాయికి చేరుకోవాలని చూస్తున్నారు. ట్యాబ్ లు, బైజూస్ కంటెంట్ తో చదువుకుని ప్రపంచాన్ని ఏలాలని చూస్తుంటే.. చంద్రబాబు మాత్రం మళ్ళీ చేపలు పట్టుకోవాలని, ఇస్ర్తీ చేసుకోవాలని చెప్తున్నారు. చంద్రబాబు, ఆయన కులం వాళ్ళే ఇంగ్లీషు చదువుకుని ఇతర దేశాలకు వెళ్లాలా? దుర్మార్గపు ఆలోచనలు చేసే నీకు మళ్ళీ ఎందుకు అధికారం ఇవ్వాలి? కందుకూరులో ఎనిమిది మందిని పొట్టన పెట్టుకున్నారు. మీరంతా ఇక్కడే ఉండండి, మళ్ళీ వస్తానని అన్నాడు. ఆయనకి చిన్నమెదడు చితికిపోవడం వలనే ఇలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు మంత్రి జోగి రమేష్.
Also Read
- Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
- Hyderabad: అమీర్పేట్లో భారీ అగ్ని ప్రమాదం.. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు
- AI in Media: ఏఐ ప్రపంచాన్నే మార్చేస్తోంది.. కానీ జర్నలిజాన్ని భర్తీ చేయగలదా?
- Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
Read Also: Project K: షోరూమ్ కి వెళ్తే దండిగా దొరుకుతాయి టైర్లు…
అధికారం కోసం ఇంతగా దిగజారాలా? 24 గంటలు కూడా కాకముందే మళ్ళీ బహిరంగ సభలు పెడుతున్నారు. అభం శుభం తెలియని వారు చనిపోతే త్యాగం చేశారని చెప్పటానికి సిగ్గులేదా? నీ పదవుల కోసం పేదోళ్లు బలి కావాలా? ఏం.. నువ్వో, నీ కుటుంబ సభ్యులో త్యాగం చేయొచ్చుగా? వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నడ్డి విరిచేస్తాం అన్నారు. లోకేష్ పాదయాత్ర అంటే ఫ్యాషన్ షో అనుకుంటున్నాడు. అదేమైనా ఫిజికల్ ఎక్సర్ సైజా? పొలిటికల్ ఎక్సర్ సైజా? సీమ పందికి ఫ్యాంటు, షర్టు వేసినట్టుగా ఉంటుంది. వార్డు సభ్యునిగా కూడా గెలవలేని లోకేష్.. జగన్ ని విమర్శించటమేంటి? అని మండిపడ్డారు జోగి రమేష్.
ఆ పాదయాత్రకు యువగళం సూట్ అవదు. అందుకని పప్పుగళం, తుప్పుగళం, చిప్పగళం అని పేరుకుంటే మంచిది… పవన్ కళ్యాణ్ కూడా ఈ సవాల్ స్వీకరించాలి. కందుకూరు ఘటనకు చంద్రబాబే బాధ్యత వహించాలన్నారు. అమాయకుల ప్రాణాలు పోవటానికి కారణమైన చంద్రబాబుని అరెస్టు చేయాలి. చంద్రబాబు సభలపై పోలీసులు విచారణ జరపాలి. చంద్రబాబు చేసిన సవాల్ స్వీకరించటానికి నేను సిద్దం. చంద్రబాబుతో సహా ఎవరు వచ్చినా జనం మధ్య, మీడియా సమక్షంలో చర్చకు రెడీ కావాలి. టైం, డేట్, ప్లేస్ వాళ్లే చెప్పాలని డిమాండ్ చేశారు జోగి రమేష్.
Read Also: Bairi Naresh: బైరి నరేష్ కోసం పోలీసులు వేట.. పీడీయాక్ట్ పెట్టాలంటున్న ఎమ్మెల్యే..
తాజావార్తలు
-
Electricity Bill: ఇంట్లో ఈ పరికరాలే మీ కరెంట్ బిల్లును పెంచుతున్నాయా? అసలు నిజం ఇదే
-
Chiranjeevi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిరంజీవి ట్వీట్..’తండ్రిగా మాత్రమే కాదు.. నటుడిగా కూడా గర్వపడుతున్నా’
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Crime Thriller OTT : నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడిస్తే… ఓటీటీలోకి గూస్ బంప్స్ తెప్పించే కన్నడ క్రైమ్ థ్రిల్లర్
-
Hyderabad: అమీర్పేట్లో భారీ అగ్ని ప్రమాదం.. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు
ట్రెండింగ్
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!