NTV Telugu Site icon

Mid Night Attack: అర్ధరాత్రి ఇళ్లలోకి చొరబడి విధ్వంసం

Attack

Attack

Mid Night Attack: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుద్ధారం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. అర్ధరాత్రి సమయంలో రెండు ఇళ్లలోకి చొరబడి విధ్వంసం సృష్టించారు రెండో తల్లి బంధువులు. గంధం పరమేష్, కుమార్ అనే ఇద్దరు అన్నదమ్ముల ఇళ్లను ధ్వంసం చేసారు. రెండో తల్లి వెంకటలక్ష్మి తన కుమారుడు నరేష్ సమీప బంధువులతో వచ్చి రాత్రి ఇంట్లో ఉప్పు, పప్పు, కట్టుకునే బట్టలు, టీవీ, ఫ్రిడ్జ్, బియ్యం, రెండు తులాల బంగారం, రూ. 60 వేల నగదు ఇంట్లో ఉన్న సామాగ్రి ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారని బాధితులు తెలిపారు.

IAS Petition: హైకోర్టులో లంచ్మోషన్ పిటిషన్ దాఖలు చేసిన ఐఏఎస్లు..

ఈ ఘటనతో ఒక్కసారిగా కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. పరమేష్, కుమార్ కుటుంబంతో సహా రెండో తల్లి, నరేష్ దాడి చేసేందుకు వస్తున్నారని గమనించి వేరే ఇంట్లో తలదాచుకున్నారు. గంధం పరమేష్, కుమార్ రాత్రి సమయంలో కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో ఇంటిని ధ్వంసం చేశారు. గంధం పరమేష్ కుమార్ తమ కుటుంబం కట్టుబట్టలతో రోడ్డున పడ్డామని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మా రెండు కుటుంబాలకు తల్లి కుటుంబంతో మాకు ప్రాణహాని ఉందని మమ్మల్ని కాపాడాలని వారు వేడుకుంటున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: Viral : మూత్రం పోసి చపాతీలు పిసికిన పనిమనిషి.. సీసీ కెమెరాలో చూసి కంగుతిన్న యజమాని