Central Minister: ఏపీ రాజధాని నిర్మాణంపై.. కేంద్ర మంత్రి పెమ్మసాని కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతి రాజధాని ప్రాంత రైతులు, ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా సీఆర్డీఏ (CRDA) కార్యాలయంలో త్రీ మ్యాన్ కమిటీ కీలక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొని అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
ఫీల్డ్ విజిట్లకు ప్రాధాన్యం..
అసెంబ్లీ సమావేశాలు , ఇతర అనివార్య కారణాల వల్ల త్రీ మ్యాన్ కమిటీ సమావేశం కొంత ఆలస్యమైనప్పటికీ, ఇకపై పనుల్లో వేగం పెంచాలని నిర్ణయించారు. రాజధాని గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి మంత్రి నారాయణతో పాటు సీఆర్డీఏ కమిషనర్, జాయింట్ కమిషనర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని (ఫీల్డ్ విజిట్) ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రజల వద్దకే వెళ్లి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Also Read
- Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
- Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
- Story Board: నాడు కేసులు.. నేడు వరాలు.. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు..!
ఈ సమావేశంలో ప్రధానంగా ఎన్ఎస్పీ (NSP) ప్రభావిత బాధితుల ఇళ్ల సమస్యలు, ఎఫ్ఎస్ఐ (FSI)కి సంబంధించిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. రాజధాని ప్రాంతంలోని గ్రామీణ రహదారుల మరమ్మతులు, మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కమిటీ తీర్మానించింది. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సీఆర్డీఏ కమిషనర్ విజయరామరాజు ఈ ప్రక్రియను వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషించనున్నారు.
రాజధాని పనులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, ప్రతి 2-3 వారాలకు ఒకసారి రెగ్యులర్ మీటింగ్లు నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది. కేవలం చర్చలకే పరిమితం కాకుండా.. సమస్యల వారీగా సమీక్ష జరిపి, వాటి పరిష్కారంలో జరుగుతున్న పురోగతిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని అధికారులకు మంత్రి పెమ్మసాని స్పష్టం చేశారు. రాజధాని అభివృద్ధిలో రైతుల ప్రయోజనాలే పరమావధిగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?