Central Minister: ఏపీ రాజధాని నిర్మాణంపై.. కేంద్ర మంత్రి పెమ్మసాని కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతి రాజధాని ప్రాంత రైతులు, ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా సీఆర్డీఏ (CRDA) కార్యాలయంలో త్రీ మ్యాన్ కమిటీ కీలక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొని అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
ఫీల్డ్ విజిట్లకు ప్రాధాన్యం..
అసెంబ్లీ సమావేశాలు , ఇతర అనివార్య కారణాల వల్ల త్రీ మ్యాన్ కమిటీ సమావేశం కొంత ఆలస్యమైనప్పటికీ, ఇకపై పనుల్లో వేగం పెంచాలని నిర్ణయించారు. రాజధాని గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి మంత్రి నారాయణతో పాటు సీఆర్డీఏ కమిషనర్, జాయింట్ కమిషనర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని (ఫీల్డ్ విజిట్) ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రజల వద్దకే వెళ్లి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Also Read
- JD Vance: మరోసారి భార్య ఉషా గురించి జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు.. వైరల్
- Rajahmundry Tragedy: రాజమండ్రి రైల్ బ్రిడ్జిపై విషాదం.. గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్!
- Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
- Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
ఈ సమావేశంలో ప్రధానంగా ఎన్ఎస్పీ (NSP) ప్రభావిత బాధితుల ఇళ్ల సమస్యలు, ఎఫ్ఎస్ఐ (FSI)కి సంబంధించిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. రాజధాని ప్రాంతంలోని గ్రామీణ రహదారుల మరమ్మతులు, మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కమిటీ తీర్మానించింది. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సీఆర్డీఏ కమిషనర్ విజయరామరాజు ఈ ప్రక్రియను వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషించనున్నారు.
రాజధాని పనులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, ప్రతి 2-3 వారాలకు ఒకసారి రెగ్యులర్ మీటింగ్లు నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది. కేవలం చర్చలకే పరిమితం కాకుండా.. సమస్యల వారీగా సమీక్ష జరిపి, వాటి పరిష్కారంలో జరుగుతున్న పురోగతిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని అధికారులకు మంత్రి పెమ్మసాని స్పష్టం చేశారు. రాజధాని అభివృద్ధిలో రైతుల ప్రయోజనాలే పరమావధిగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.
తాజావార్తలు
-
Jio IPO: వేల కోట్లు కొల్లగొట్టడానికి రెడీ అయిన జియో.. ఐపీఓపై అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసిన ముఖేష్ అంబానీ!
-
The Paradise: ఈరోజు సాయంత్రం ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు! నాని ‘ప్యారడైజ్’ న్యూ పోస్టర్ చూశారా?
-
JD Vance: మరోసారి భార్య ఉషా గురించి జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు.. వైరల్
-
Nagadurga: సుకుమార్ – బన్నీ వాస్ బ్యానర్లలో క్రేజీ ప్రాజెక్ట్.. ప్రియదర్శి జోడీగా రంగంలోకి దిగిన ఫోక్ స్టార్!
-
Afghan: పాక్ గడ్డపై ఆఫ్ఘన్ డ్రోన్ల పంజా.. గురితప్పని దాడి, కుప్పకూలిన ఐసిస్ అడ్డాలు!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?