Sessions of Parliament: పార్లమెంట్ లో అమరవీరులకు ఘన నివాళ్లు.. మౌనం పాటించిన సభ్యులు

  • ఈరోజు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ఐదవ రోజు
  • పార్లమెంటు సభ కార్యకలాపాలు ప్రారంభం
  • కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులకు నివాళులు
  • మౌనం పాటించి నివాళులర్పించిన ఎంపీలు
Sessions Of Parliament

Sessions Of Parliament

ఈరోజు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ఐదవ రోజు. నిన్న అంటే గురువారం బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఉభయ సభల్లో తీవ్ర రభస జరిగింది. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో విపక్ష నేతలు వాకౌట్‌ కూడా చేశారు. పంజాబ్ మాజీ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ, బీజేపీ నేత రవ్‌నీత్ సింగ్ బిట్టు మధ్య లోక్‌సభలో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. సభలో ఇరువురు నేతలూ వాగ్వాదానికి దిగారు. అదే సమయంలో ద్రవ్యోల్బణం అంశంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా రాజ్యసభలో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. భారత్‌లో ఇంగ్లండ్‌లా పన్నులు తీసుకుంటారని, అయితే సోమాలియా తరహాలో సేవలు అందిస్తున్నారని చద్దా అన్నారు. ఈరోజు కూడా పార్లమెంటులో గందరగోళం జరిగే అవకాశాలు ఉన్నాయి.

READ MORE: Paris Olympics 2024: పారిస్‌ ఒలింపిక్స్‌లో 11 ఏళ్ల చిన్నారి.. ఆల్‌టైమ్ లిస్ట్‌లో ఎవరున్నారో తెలుసా?

పార్లమెంటు సభ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులకు నివాళులర్పించారు. ముందుగా పార్లమెంట్ స్పీకర్ అమరవీరుల గురించి ప్రసంగించారు. అనంతరం ఎంపీలంతా మౌనం పాటించారు. ప్రస్తుతం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది.

READ MORE:Komatireddy Venkat Reddy: హాట్‌ కామెంట్.. కేసీఆర్ స్థానంలో నేనుంటే రాజకీయాలకు గుడ్ బై చెప్పేవాడిని..

కాగా.. మరోవైపు 25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ద్రాస్‌లో అమరవీరులకు ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. కార్యక్రమం కోసం ప్రధాని మోడీ కార్గిల్ యుద్ధ స్మారకం వద్దకు చేరుకుని, 1999లో భారత్-పాకిస్థాన్ యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న పాకిస్థాన్ పై ప్రధాని మోడీ విరుచుకు పడ్డారు. పాకిస్థాన్ గతంలో భారత్ ను ఓడించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓటమిని చవిచూడాల్సి వచ్చిందన్నారు. కానీ పాకిస్థాన్ తన చరిత్ర నుంచి ఏమీ నేర్చుకోలేదని తెలిపారు.