మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘విశ్వంభర’. ఈ మూవీ కోసం మెగా అభిమానులు ఎంతో అత్రుతగా ఎదురుచూస్తుండగా,తాజాగా చిత్ర యూనిట్ ఒక అదిరిపోయే ‘డబుల్ ట్రీట్’ ఇచ్చేందుకు సిద్ధమవుతోందట. భారీ వీఎఫ్ఎక్స్ (VFX) పనుల కారణంగా కొంత జాప్యం జరిగినప్పటికీ, ఇప్పుడు పనులన్నీ చివరి దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ఒకేసారి పవర్ఫుల్ ట్రైలర్ను విడుదల చేస్తూ, దానితో పాటే అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త రిలీజ్ డేట్ను కూడా ప్రకటించాలని ప్లాన్ చేస్తున్నారు. వాస్తవానికి శ్రీరామనవమి (ఏప్రిల్ 6, 2026) రోజే ఈ అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఆశించినప్పటికీ, ఇతర సినిమాల హడావిడి కారణంగా మెగా టీమ్ కొంచెం వెనక్కి తగ్గింది. దీంతో త్వరలోనే ఎటువంటి పోటీ లేని సమయంలో గ్రాండ్గా ఈ డబుల్ అనౌన్స్మెంట్ చేయాలని యువీ క్రియేషన్స్ భావిస్తోంది.
ఇక ఈ సినిమాలో దాదాపు మూడు దశాబ్దాల తర్వాత చిరంజీవి – త్రిష కాంబినేషన్ మళ్ళీ వెండితెరపై మ్యాజిక్ చేయబోతుండగా. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండటంతో సాంగ్స్.. బ్యాక్గ్రౌండ్ స్కోర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమా రేంజ్ను చెప్పకనే చెప్పగా, ఇప్పుడు రాబోయే ట్రైలర్ గనుక మెప్పిస్తే అంచనాలు ఆకాశాన్ని తాకడం ఖాయం. సోషియో ఫాంటసీ నేపథ్యంలో సాగే ఈ చిత్రం మెగాస్టార్ కెరీర్లోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. మరి ఆ డబుల్ ట్రీట్ ఇచ్చే ఆ ముహూర్తం ఎప్పుడో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే..
