తెలుగు సినిమా గమనాన్ని మార్చేసిన ఒకే ఒక్క పేరు.. ‘మెగాస్టార్’ చిరంజీవి. ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా, కేవలం కృషితో బాక్సాఫీస్ రారాజుగా ఎదిగిన ఆయన ప్రయాణం ఒక మహా కావ్యం. నటనలో ఒడిదుడుకులు, డ్యాన్స్లో కొత్త ఒరవడి, ఫైట్స్లో గ్రేస్.. ఇలా అన్నీ కలగలిసిన ఆ శిఖరం వెండితెరపై మొదటి అడుగు వేసి నేటికి సరిగ్గా 48 ఏళ్లు పూర్తయింది. ఈ అరుదైన సందర్భాన్ని పురస్కరించుకుని, తన సినీ జీవితానికి తొలి ‘పునాది’ పడిన రోజును గుర్తు చేసుకుంటూ చిరంజీవి గారు చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
Also Read : NTR-Neel : ఎన్టీఆర్-నీల్ మూవీ టీజర్తో టైటిల్.. టీజర్ డేట్ ఫిక్స్?
చందమామ కథ లాంటి ఆ తొలి అడుగు.. 1978 ఫిబ్రవరి 11న ‘పునాదిరాళ్లు’ సినిమా కోసం చిరంజీవి తొలిసారి కెమెరా ముందుకు వచ్చారు. ఆ రోజు అనుభూతిని నెమరువేసుకుంటూ.. “ఆ రోజు నాలో కలిగిన ఆత్రుత, ఆనందం, బాధ్యత మాటల్లో వర్ణించలేనివి. ఆ క్షణం ఇప్పటికీ నిన్న మొన్న జరిగినట్టే అనిపిస్తుంది.. అదొక అందమైన చందమామ కథ లాంటి అనుభూతి” అని ఆయన రాసుకొచ్చారు. తనపై నమ్మకం ఉంచి మొదటి అవకాశం ఇచ్చిన దర్శకుడు గుడపాటి రాజకుమార్, నిర్మాత క్రాంతి కుమార్ గారికి ఆయన శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలిపారు. కేవలం ఒక నటుడిగానే కాకుండా, తనను ఇంట్లో మనిషిలా ఆదరిస్తున్న ప్రేక్షకులే తన ఈ విజయానికి అసలైన పునాది అని చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. ‘పునాదిరాళ్లు’ సినిమానే ఆయన కెరీర్కు నిజమైన పునాదిగా నిలిచిందని ఈ సందర్భంగా ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు.
