NTV Telugu Site icon

Mega Allu Fyamily : మెగా హీరోలందరూ ఒక్కచోట కలిస్తే పండగే.. క్రిస్మస్ ఫొటోస్ వైరల్..

Chrimats

Chrimats

సోమవారం క్రిస్మస్ పండగ సందడి ముగిసింది.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు చాలామంది ఈ పండగని సెలబ్రేట్ చేసుకున్నారు. హీరోయిన్ల నుంచి హాట్ బ్యూటీస్ వరకు దాదాపు ప్రతి ఒక్కరూ ఫొటోలని తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు..దాదాపు అందరు ఈ పండుగను ఘనంగా జరుపుకున్నారు.. ఇక మెగా ఫ్యామిలీ సంగతి మాటల్లో చెప్పలేము.. మెగా అల్లు ఫ్యామిలీ క్రిస్మస్ వేడుకల ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

వీళ్ళ ఫ్యామిలిలో ఏ పండగ వచ్చిన సందడి మాములుగా ఉండదు.. మెగా ఫ్యామిలీలో దాదాపు అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. తాజాగా క్రిస్మస్ జరగ్గా.. యంగ్ హీరోలతో పాటు కజిన్స్ అందరూ ఒక్కచోటకు చేరారు. అల్లు అర్జున్, రామ్ చరణ్ కూడా ఒక్కటిగా కనిపించడం.. ఆయా హీరోల అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. ఎందుకంటే గత కొన్నిరోజుల ఈ హీరోల మధ్య బాండింగ్ సరిగా లేదని రూమర్స్ వచ్చాయి.. దానికి చెక్ పెడుతూ ఇద్దరు కలిసి సందడి చేస్తున్నారు..

ఇకపోతే ఈ ఏడాది చరణ్ పుట్టినరోజున అల్లు అర్జున్ బర్త్ డే విషెస్ చెప్పకపోవడం.. అల్లు అర్జున్‌కి నేషనల్ అవార్డ్ వచ్చినప్పుడు చరణ్.. సోషల్ మీడియాలో ఏం విష్ చేయకపోవడం తదితర అంశాల వల్ల వీళ్లిద్దరి మధ్య సఖ్యత లేదని అనుకున్నారు. కానీ తాజాగా క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో వీళ్లు కలిసి కనిపించారు. వరుణ్ తేజ్, నిహారిక, ఉపాసన, అల్లు స్నేహా, లావణ్య త్రిపాఠి, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్ లు ఆ ఫొటోలో కనిపిస్తున్నారు.. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.