Medchal District: మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి కౌకూర్లో దారుణం చోటు చేసుకుంది. గత ఏడాది క్రితం అంజూ అనే మహిళ అదృశ్యమైనట్లు జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అంజూ అదృశ్యంపై విచారణలో భాగంగా పోలీసులు పలు కోణాల్లో విచారించగా చిన్న కుమార్తె కూతురు ఇషికా, అల్లుడి కుమార్పై అనుమానాలు వచ్చాయి. లొతుగా విచారించగా సంచలన నిజాలు బయటకు వచ్చాయి. కన్న కూతురు, అల్లుడు తల్లిని కిరాతకంగా చంపి ఇంట్లోనే పూడ్చిపెట్టినట్లు తేలింది. కన్న తల్లిని తానే హతమార్చినట్లు కూతురు ఇషికా పోలీసుల ఎదుట ఒప్పుకుంది. దీంతో ఘటన స్థలిలో మృతదేహాన్ని వెలికి తీస్తున్నారు పోలీసులు.. నిందితులపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.
Medchal: కన్న తల్లిని కిరాతకంగా చంపి ఇంట్లోనే పూడ్చిపెట్టిన కుమార్తె.. ఏడాది తర్వాత బయటపడ్డ నిజం!

Medchal