Matthew Wade Retirement: భారత్తో సిరీస్ ముందు.. రిటైర్మెంట్ ప్రకటించిన ప్రపంచకప్ విన్నర్!
- మాథ్యూ వేడ్ కీలక నిర్ణయం
- అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్
- ఆస్ట్రేలియా కోచింగ్ బృందంలో వేడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆస్ట్రేలియా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ మాథ్యూ వేడ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 36 ఏళ్ల వేడ్ 2011లో ఆస్ట్రేలియా తరఫున అరంగేట్రం చేశాడు. 2024 టీ20 ప్రపంచకప్లో భారత్పై తన చివరి మ్యాచ్ ఆడాడు. 2021 నుంచి వన్డే, టెస్టుల్లో ఆడే అవకాశం రాలేదు. ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్ 2021 గెలిచిన జట్టులో వేడ్ సభ్యుడిగా ఉన్నాడు. పాకిస్థాన్తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో షాహీన్ అఫ్రిది బౌలింగ్లో మూడు సిక్సర్లు బాది ఆస్ట్రేలియాను ఫైనల్కు తీసుకెళ్లాడు.
13 ఏళ్ల కెరీర్లో మాథ్యూ వేడ్ 36 టెస్ట్లు, 97 వన్డేలు, 92 టీ20లు ఆడి.. 4700 పైచిలుకు పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 19 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆస్ట్రేలియాకు 13 టీ20 మ్యాచ్లకు కెప్టెన్గా కూడా వ్యవహరించాడు. బ్రాడ్ హాడిన్ వ్యక్తిగత కారణాల వల్ల వైదొలిగడంతో వేడ్ జట్టులోకి వచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన వేడ్.. దేశవాలీ క్రికెట్, బిగ్బాష్ లీగ్లో మాత్రం కొనసాగుతాడు. రిటైర్మెంట్ అనంతరం ఆండ్రీ బోరోవెక్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా కోచింగ్ బృందంలో అతడు జాయిన్ అవుతాడు. వచ్చే నెలలో పాకిస్తాన్తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ నుంచి వేడ్ కొత్త బాధ్యతలు చేపడతాడు.
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
Also Read: IPL 2025 Retention: షాకింగ్ న్యూస్.. ఛాంపియన్ ప్లేయర్పై వేటు! కోల్కతా రిటైన్ లిస్ట్ ఇదే
నవంబర్ 4 నుంచి ఆస్ట్రేలియాలో పాకిస్తాన్ పర్యటించనుంది. ఈ పర్యటనలో మూడు వన్డేలు, మూడు టీ20లు జరగనున్నాయి. టీ20 సిరీస్లో మాథ్యూ వేడ్ కోచ్గా కొత్త బాధ్యతలు చేపడతాడు. ఏదో ఓ రోజు హెడ్ కోచ్ కావాలన్నది వేడ్ ఆకాంక్ష. ఇక ఆస్ట్రేలియా వికెట్ కీపర్గా జోష్ ఇంగ్లిస్ ఆడనున్నాడు. జట్టులో స్థానం కోసం సీనియర్ కీపర్ టిమ్ పైన్తో ఇంగ్లిస్ పోటీ పడుతున్నాడు. పాక్ సిరీస్ల అనంతరం ఆస్ట్రేలియా స్వదేశంలో భారత్తో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఆడుతుంది. భారత్తో సిరీస్ ముందు వేడ్ రిటైర్మెంట్ ప్రకటించడం విశేషం.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!