Maoists Attack: వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ఎస్టీఎఫ్ జవాన్లు, మహిళా నక్సల్ మృతి..

  • ఛత్తీస్‌గఢ్‌ లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఐఇడి పేల్చడంతో ఇద్దరు ఎస్‌టిఎఫ్ సిబ్బంది మరణం.
  • దంతేవాడ జిల్లాలో ఒక మహిళా నక్సలైట్‌ ను హతమార్చిన పోలీసులు.
  • బీజాపూర్‌ లో జరిగిన ఐఈడీ పేలుడులో నలుగురు ఎస్టీఎఫ్ సిబ్బందికి గాయాలు..
Maoists Attack

Maoists Attack

Maoists Attack : ఛత్తీస్‌గఢ్‌ లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరం (ఐఇడి) పేల్చడంతో ఇద్దరు స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టిఎఫ్) సిబ్బంది మరణించగా, దంతేవాడ జిల్లాలో భద్రతా సిబ్బంది గురువారం ఒక మహిళా నక్సలైట్‌ ను హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. బీజాపూర్‌ లో జరిగిన ఐఈడీ పేలుడులో నలుగురు ఎస్టీఎఫ్ సిబ్బంది గాయపడగా., అదే జిల్లాలో జరిగిన మరో ఘటనలో నక్సలైట్లు అమర్చిన పేలుడు పరికరం పేలడంతో రాష్ట్ర పోలీసు జిల్లా రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ)కి చెందిన ఇద్దరు జవాన్లు గాయపడ్డారని వారు తెలిపారు. జాపూర్-సుక్మా-దంతెవాడ జిల్లాల ట్రై జంక్షన్‌లోని అడవుల్లో యాంటీ నక్సలైట్ ఆపరేషన్ తర్వాత భద్రతా సిబ్బంది సంయుక్త బృందం తిరిగి వస్తుండగా.. బీజాపూర్ జిల్లాలో బుధవారం రాత్రి టార్రెమ్ ప్రాంతంలో ఐఈడీ పేలుడు సంభవించిందని పోలీసు అధికారి తెలిపారు.

Indo-Pak War Time: ఇండో-పాక్ యుద్ధ కాలం నాటి 27 మోర్టార్ షెల్స్ లభ్యం..

STF సిబ్బంది, DRG రెండు రాష్ట్ర పోలీసు విభాగాలు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అలాగే దాని ఎలైట్ కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్ (CoBRA) ఈ ఆపరేషన్‌లో పాల్గొంది. మంగళవారం నాడు వారి దర్భకు చెందిన నక్సలైట్ల ఉనికి గురించి సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఇద్దరు STF కానిస్టేబుళ్లు రాయ్‌పూర్ నివాసి భరత్ సాహు, నారాయణపూర్ జిల్లాకు చెందిన సత్యర్ సింగ్ కాంగే నక్సలైట్లు ఉంచిన పేలుడులో మరణించారు. మరో నలుగురు సిబ్బంది గాయపడ్డారని అధికారి తెలిపారు.

FASTag Alert: ముందువైపు అద్దం మీదే ఫాస్టాగ్‌.. లేకపోతే టోల్‌ రుసుం డబుల్..!

ఈ ఘటనపై ముఖ్యమంత్రి విష్ణుదేవ సాయి విచారం వ్యక్తం చేస్తూ.. జవాన్ల త్యాగం వృథాకాదని నక్సలిజం ముప్పును నిర్మూలించే వరకు పోరాటం కొనసాగిస్తామని అన్నారు. “బీజాపూర్‌ లోని టార్రెమ్ ప్రాంతంలో మావోయిస్టులు జరిపిన IED పేలుడులో 2 STF జవాన్లు వీరమరణం పొందడం, అలాగే 4 జవాన్లకు గాయాలు కావడం గురించి విచారకరమైన వార్త తెలిసింది. మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని గాయపడిన జవాన్లు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. నక్సలైట్ల బెడదను తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యకలాపాలతో విసుగు చెంది పిరికిపంద చర్యలకు పాల్పడుతున్నారని., జవాన్ల బలిదానాలు వృథా కావు. మావోయిజం అంతమయ్యే వరకు మా పోరాటం కొనసాగుతుందని X లో ఒక పోస్ట్‌లో తెలిపారు.