పారిస్ ఒలింపిక్స్లో భారత్కు రెండు పతకాలను సాధించి చరిత్ర సృష్టించిన షూటర్ మను భాకర్.. క్రీడల్లో ఉండే చిన్న చిన్న నైపుణ్యాలను నేర్చుకుంటుంది. ఇటీవలే ఆమె గుర్రపు స్వారీ, భరతనాట్యం.. స్కేటింగ్ నేర్చుకోవాలని తన కోరికను వ్యక్తం చేసింది. తాజాగా.. ఆమె క్రికెట్ నేర్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో.. ఆదివారం భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో కలిసి ఉన్న చిత్రాన్ని మను భాకర్ పంచుకుంది. ఈ ఫొటోకి మను అద్భుతమైన క్యాప్షన్ కూడా రాసింది. ‘నేను మిస్టర్ 360 ఆఫ్ ఇండియాతో కొత్త గేమ్ లో మెళకువలను నేర్చుకుంటున్నాను.’ అని తెలిపింది. కాగా.. ‘x’లో పోస్ట్ చేసిన ఫోటోలో మను బ్యాటింగ్ చేస్తున్నట్లు పోజ్ ఇస్తుంది. కాగా.. ప్యారిస్లో చరిత్ర సృష్టించిన మను ప్రస్తుతం మూడు నెలల విరామంలో ఉంది. ఈ క్రమంలో.. భారత టీ20 కెప్టెన్ నుండి క్రికెట్ యొక్క మెళకువలను నేర్చుకుంటుంది.
Read Also: Pakistan Citizen: రాజస్థాన్ బార్డర్లో పాకిస్తాన్ పౌరుడు.. పట్టుకున్న పోలీసులు
ఈ ఫోటో చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక వినియోగదారు ఇలా వ్రాశారు. ‘భారతదేశంలోని ఇద్దరు సూపర్స్టార్లు. నేటి అందమైన, ఐకానిక్ చిత్రం. దేవుడు మీ ఇద్దరినీ ఆశీర్వదిస్తాడు’. మరొక వినియోగదారు, ‘ఒక ఫ్రేమ్లో రెండు ఛాంప్లు’ అని రాశారు. కాగా.. పారిస్ 2024 ఒలింపిక్స్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, మిక్స్డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లలో మను భాకర్ రెండు కాంస్య పతకాలు సాధించి చరిత్ర సృష్టించింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఒకే ఒలంపిక్ గేమ్స్లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా నిలిచింది. కాగా.. టోక్యో 2020 ఒలింపిక్స్లో మను నిరాశ పరిచింది. అందులో.. ఆమె తన మూడు ఈవెంట్లలో ఫైనల్స్కు చేరుకోవడంలో విఫలమైంది.
Learning techniques of a new sport with the Mr. 360 of India! @surya_14kumar 💪 pic.twitter.com/nWVrwxWYqy
— Manu Bhaker🇮🇳 (@realmanubhaker) August 25, 2024
Read Also: Actor Darshan: జైలులో దర్శన్కి వీఐపీ ట్రీట్మెంట్.. రేణుకాస్వామి తండ్రి ఆవేదన..
