Maratha Reservation: ‘మేము గెలిచాము’.. నిరాహార దీక్షను విరమించిన మరాఠా నాయకుడు
Maratha Reservation: మరాఠ్వాడా, పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన మరాఠాలకు ఉద్యోగాలు, విద్యలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ముంబైలోని ఆజాద్ మైదాన్లో మనోజ్ జరంగే పాటిల్ నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన ప్రాథమిక డిమాండ్కు మహారాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పాటు రిజర్వేషన్ల డిమాండ్తో నిరసన తెలుపుతున్న వారిపై దాఖలైన అన్ని కేసులను ఉపసంహరించుకోవడానికి కూడా ప్రభుత్వం అంగీకరించింది. క్యాబినెట్ సబ్-కమిటీతో సమావేశం తర్వాత, ప్రభుత్వం తీర్మానం జారీ చేసిన అనంతరం.. తన మద్దతుదారులు రాత్రి 9 గంటలకు ముంబైని ఖాళీ చేస్తారని పాటిల్ ప్రకటన విడుదల చేశారు. ప్రకటన వెలువడిన కొన్ని గంటల తర్వాత “మేము గెలిచాము” అని చెబుతూ ఆయన తన 5 రోజుల నిరాహార దీక్షను ముగించారు. మహారాష్ట్ర మంత్రి రాధాకృష్ణ విఖేపాటిల్ ఆయనతో నిరాహార దీక్షను విరమింపజేశారు.
READ ALSO: Udayabhanu: బాలయ్య చూపించే ప్రేమ, నా ఫ్యామిలీ దగ్గర నుంచి కుడా దొరకలేదు
Also Read
- Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
- Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
- India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
- Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
పాటిల్ను కలిసిన మంత్రివర్గ ఉపసంఘం
ఇప్పటి వరకు మహారాష్ట్రలో కున్బీ సమాజం OBC వర్గం కింద రిజర్వేషన్లను పొందుతోంది. మరాఠా రిజర్వేషన్ సమస్యకు హైదరాబాద్ గెజిట్ సంబంధం ఏంటంటే.. ప్రస్తుత మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతం ఒకప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉండేది. ముంబైలోని ఆజాద్ మైదాన్లోని నిరసన స్థలంలో మంగళవారం మంత్రివర్గ ఉపసంఘం పాటిల్ను కలిసింది. మంత్రులు రాధాకృష్ణ విఖే పాటిల్, మాణిక్రావు కోకాటే, శివేంద్ర రాజే భోసలే ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం పాటిల్ మాట్లాడుతూ.. మరాఠా రిజర్వేషన్ డిమాండ్ను నెరవేర్చడానికి హైదరాబాద్ గెజిట్ను అమలు చేయడానికి క్యాబినెట్ సబ్-కమిటీ అంగీకరించిందని చెప్పారు. మంత్రులతో సమావేశం తర్వాత ఆయన తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. “మీ బలంతో మనం గెలిచాము, ఈ రోజు నేను పేదల శక్తిని అర్థం చేసుకున్నాను” అని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ స్పందనతో తాము సంతోషంగా లేమని బాంబే హైకోర్టు పేర్కొంది. ఆజాద్ మైదాన్లో ఆందోళన కొనసాగించాలన్న తన అభ్యర్థనను ముంబై పోలీసులు తిరస్కరించడంతో పాటిల్ హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రశేఖర్, న్యాయమూర్తి ఆర్తి సాథేలతో కూడిన ధర్మాసనం పాటిల్ న్యాయవాదితో మాట్లాడుతూ.. మధ్యాహ్నం 3 గంటలలోపు వీధుల్లో సాధారణ పరిస్థితులు పునరుద్ధరించకపోతే, న్యాయమూర్తులు వీధుల్లోకి వస్తారని చెప్పారు. తమ ఆదేశాలను పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని మరాఠా నాయకుడిని హెచ్చరించారు. ముంబైలోని ఆజాద్ మైదాన్ సమీపంలో వేలాది మంది మరాఠా మద్దతుదారులు సాధారణ ప్రజల జీవితానికి తీవ్ర అంతరాయం కలిగించిన నేపథ్యంలో బెంచ్ ఈవిధంగా స్పందించింది. విచారణ సందర్భంగా నిరసనల వల్ల కలిగిన అసౌకర్యానికి పాటిల్ న్యాయవాది సతీష్ మాన్షిండే పాటిల్ క్షమాపణలు చెప్పారు. 5000 మందితో కూడిన సమావేశానికి మాత్రమే అనుమతి ఇచ్చినప్పుడు, నిరసనలకు అంత మంది ఎందుకు వచ్చారని కోర్టు పాటిల్ను ప్రశ్నించింది. “60,000 మందికి పైగా ప్రజలు నగరంలోకి వచ్చారని మీకు తెలిసినప్పుడు, మీరు ఏ చర్యలు తీసుకున్నారు?” అని ధర్మాసనం ప్రశ్నించింది, బెంచ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తుందని పేర్కొంది.
READ ALSO: Konaseema : అప్పనపల్లిలో పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీ వివాదం.. కోనసీమలో రాజకీయ వేడి
తాజావార్తలు
-
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!