టాలీవుడ్ యంగ్ హీరోయిన్, మాజీ మిస్ ఇండియా మానస వారణాసి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదలైన తన రెండో చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ’తో మంచి విజయాన్ని అందుకున్న ఈ బ్యూటీ, తాజాగా ఒక ఇంటర్వ్యూలో ‘లివింగ్ టుగెదర్’ అంశంపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘ఏ బంధంలోనైనా అవగాహన (Understanding) అనేది చాలా ముఖ్యం, ఒకరినొకరు పూర్తిగా తెలుసుకోవడానికి లివింగ్ రిలేషన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. పాత కాలంలో పెళ్లయ్యాక మాత్రమే ఒకరి గురించి ఒకరు తెలుసుకునేవారు, దానివల్ల ఎన్నో కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చేది.. కానీ
Allso Read : Allu Arjun:స్నేహారెడ్డికి బన్నీ కాస్ట్లీ సర్ప్రైజ్.. 15వ యానివర్సరీ గిఫ్ట్ ఏంటో తెలుసా?
ఇప్పుడున్న పరిస్థితుల్లో లివింగ్ రిలేషన్ వల్ల ముందే ఒకరి స్వభావం, ఆలోచనలు అర్థం చేసుకునే అవకాశం దక్కుతోంది. అప్పటి వారిలా సర్ధుకు పోయే తత్వం ఇప్పటి వారిలో లేదు’ అని మానస తన అభిప్రాయాన్ని వెల్లడించింది. అయితే.. మానస చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట చర్చకు దారితీశాయి. కొంతమంది ఆమె ఆలోచనా ధోరణిని సమర్థిస్తుంటే, మరికొందరు మాత్రం పెళ్లికి ముందే కలిసి ఉండటం ఏంటని భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
