సినిమా రంగంలో ఎంతటి విజయాలు అందుకున్నా, నిజ జీవితంలో మాత్రం అనేక అగ్నిపరీక్షలను ఎదుర్కొన్నారు మమతా మోహన్ దాస్. ‘యమదొంగ’ హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈమె, కేవలం నటిగానే కాకుండా క్యాన్సర్ సర్వైవర్గా కూడా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. 2009లో మొదటిసారి క్యాన్సర్ బారిన పడ్డా ఆమె. దాన్ని జయించి మళ్ళీ సినిమాల్లోకి వచ్చినా, 2013లో అది మళ్ళీ తిరగబెట్టింది. అదే సమయంలో ఆమెకు బొల్లి వ్యాధి కూడా సోకింది. అయితే తాజాగా ఆమె తన ప్రేమ, పెళ్లి ఒక ప్రముఖ నటుడు తనను ఎలా మోసం చేశాడో వివరిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిల్మ్ నగర్లో సంచలనం సృష్టిస్తున్నాయి.
Also Read : Supritha : మా కన్నీళ్లతో వ్యాపారం చేస్తున్నారు.. సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!
‘క్యాన్సర్, బొల్లి వ్యాధి వంటి అనారోగ్య సమస్యలతో పోరాడుతున్న సమయంలోనే ప్రేమ, పెళ్లి విషయంలోనూ ఎంతో మానసిక వేదనను అనుభవించా. ఆ సమయంలో మలయాళంలో ఒక ప్రముఖ నటుడు ఆమెను డేటింగ్ అడిగాడు. దానికి అమ్మ కూడా ఒప్పుకుంది. అయితే అతనికి అప్పటికే వేరే అమ్మాయితో నిశ్చితార్థం అయిందనే నిజాన్ని దాచిపెట్టి నను మోసం చేశాడు’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.దీని కన్న ముందు తన చిన్ననాటి స్నేహితుడు ప్రజిత్ను ఇష్టపడి 2011లో వివాహం చేసుకున్నప్పటికీ, ఆ బంధం ఆరు నెలలకే ముగిసిపోయింది. ఒకవైపు అనారోగ్యం, మరోవైపు పెళ్లి పెటాకులు అవ్వడం తనను మానసికంగా కుంగదీశాయని ఆమె పేర్కొన్నారు. ఏది ఏమైనా ఇన్ని కష్టాలు చుట్టుముట్టినా ధైర్యంగా నిలబడి ఇప్పుడు ఆమె అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
