మలయాళ సీనియర్ స్టార్ హీరో మమ్ముట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీనిస్తూ వరుస సినిమాలతో దూసుకుపోయే ఆయన, గత ఏడాది కొన్ని నెలల పాటు షూటింగ్లకు బ్రేక్ ఇచ్చారు. అసలు మమ్ముట్టికి ఏమైంది? ఆయన ఎందుకు కనిపించడం లేదు? అని ఫ్యాన్స్ కంగారు పడ్డారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన ఆరోగ్య సమస్యపై మమ్ముట్టి మొదటిసారి నోరు విప్పారు.
Also Read : AA23 Sensation: 1 మిలియన్ రీల్స్తో ఐకాన్ స్టార్.. ‘23 థీమ్’ రికార్డు!
మమ్ముట్టి మాట్లాడుతూ..‘గత ఏడాది జూన్ సమయంలో అనారోగ్యం బారిన పడ్డారు. దీనివల్ల సుమారు 4 నెలలు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో నేను చాలా కాలం పాటు రుచి, వాసన కోల్పోయాను. అసలు గాలి పీలుస్తున్నప్పుడు ఎలాంటి వాసన రాకపోతే కలిగే ఆందోళన అంతా ఇంతా కాదు. ఆ సామర్థ్యాలను కోల్పోయినప్పుడే మనకు వాటి విలువ తెలుస్తుంది. ఇప్పుడు నెమ్మదిగా కోలుకుంటున్నాను’ అని ఆయన చెప్పుకొచ్చారు. వినికిడి, కంటిచూపు కూడా దేవుడు ఇచ్చిన వరాలని, అవి లేని వారి పరిస్థితి ఎంత బాధాకరంగా ఉంటుందో తనకు అర్థమైందని ఆయన ఎమోషనల్ అయ్యారు.
ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో కోలుకున్న మమ్ముట్టి మళ్ళీ కెమెరా ముందుకు వచ్చారు. మహేష్ నారాయణన్ దర్శకత్వంలో రాబోతున్న ‘పేట్రియాట్’ (Patriot) సినిమాలో ఆయన నటిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి, ఎందుకంటే ఇందులో మమ్ముట్టితో పాటు మరో లెజెండరీ నటుడు మోహన్ లాల్ కూడా నటిస్తున్నారు. ఇక విలన్గా వెర్సటైల్ యాక్టర్ ఫహద్ ఫాజిల్ నటిస్తుండటంతో ఈ సినిమా మలయాళ ఇండస్ట్రీలో ఒక సెన్సేషన్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
