Drug Party Network: మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు…
- మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసులో కొనసాగుతున్న విచారణ
- హోటల్స్, రెస్టారెంట్స్, పబ్బు యజమానులు కలిసి డ్రగ్స్ వాడకం
- హోటల్ యజమానుష్టుల డ్రగ్స్ కేసులో కీలక సూత్రధారి ఉన్న సూర్య
- రెస్టారెంట్ యజమాని సూర్యతోపాటు ఐదుగురిని అరెస్టు చేశాం: ఈగల్ ఎస్పీ
మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసులో విచారణ కొనసాగుతోందని ఈగల్ టీం ఎస్పీ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి సంచలన విషయాలు బయటపెట్టారు. హోటల్స్, రెస్టారెంట్స్, పబ్బు యజమానులు కలిసి డ్రగ్స్ వాడకం మొదలు పెట్టారని.. హోటల్ యజమానుష్టుల డ్రగ్స్ కేసులో సూర్య కీలక సూత్రధారిగా ఉన్నారన్నారు. మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్యతోపాటు ఐదుగురిని అరెస్టు చేశామని తెలిపారు. మిగతా వాళ్ల కోసం ఇంకా గాలిస్తున్నామని స్పష్టం చేశారు. మల్నాడు డ్రగ్ కేసులో పబ్ యజమానుల పాత్ర కూడా కీలకమేనని.. పబ్బు యజమానులు ఉద్దేశపూర్వకంగానే డ్రగ్స్ కి అనుమతించారని చెప్పారు.. డ్రగ్ తీసుకుంటున్న సూర్య గ్యాంగ్ కి ప్రత్యేకమైన స్పేస్ ఇచ్చారని.. పబ్ లోపల సీక్రెట్ ప్రాంతాలు ఏర్పాటు చేసి సూర్యకు అందజేశారని వెల్లడించారు. సూర్య నిర్వహించే డ్రగ్ పార్టీలకు పబ్ యజమానులు సహకరించారని ఈగల్ ఎస్పీ వెల్లడించారు. 9 మంది పబ్ యజమానులకు నోటీసులు ఇచ్చి పిలుస్తామని.. పబ్బు యజమానుల పైన ఇప్పటికే కేసులు నమోదు చేశామన్నారు. మూడు పబ్ యజమానులు డైరెక్ట్ గా ఇందులో సూత్రధారుగా ఉన్నారని.. 23 మంది పబ్బు రెస్టారెంట్ హోటల్స్ యజమాని కలిసి డ్రగ్ పార్టీలు చేసుకుంటున్నారన్నారు.
READ ALSO: Amazon Prime Day 2025: స్మార్ట్ టీవీలపై క్రేజీ డీల్స్.. సగం ధరకే.. ఇప్పుడు కొంటె వేలల్లో లాభం!
Also Read
- Jofra Archer: అద్భుతం.. విజయ్ గెలుపును ముందే ఊహించి ట్వీట్ చేసిన క్రికెటర్ జోఫ్రా ఆర్చర్..
- Mumbai Indians: ఐపీఎల్లో వరుస ఓటములు.. అయినా ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్...
- Kavitha: పాత రాజకీయాలకు విసిగిపోయారు.. తెలంగాణలో కూడా మార్పు తథ్యం: కవిత
- Exit Polls Failed: సర్వేలకు అందని ఓటర్ నాడి.. తలకిందులైన ఎగ్జిట్ పోల్స్..
ఇదిలా ఉండగా.. తెలంగాణ నార్కోటిక్ డ్రగ్స్ టీంకు కొత్త పేరు పెట్టిన తర్వాత అతిపెద్ద డ్రగ్ రాకెట్ ను గుట్టు రట్టు చేసింది ఈగల్ టీం. ఈగల్ టీం నేతృత్వంలో అతిపెద్ద నెట్వర్క్ బట్టబయలు అయ్యింది. కొంపల్లి లోని మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్య ఈ డ్రగ్ రాకెట్ ని నడుపుతున్నట్లు తేలింది. అంతేకాకుండా హైదరాబాద్ సైబరాబాద్ పరిధిలోని కొన్ని ప్రముఖ పబ్ యజమానుల పాత్ర కూడా ఉన్నట్లు బట్టబయలైంది. ప్రతిరోజు పబ్బులలో డ్రగ్స్ తీసుకొచ్చి పార్టీలు జరుగుతున్నట్లు అధికారులు తేల్చారు. ఇందుకు సంబంధించి పది పబ్బుల పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చారు అధికారులు. మూడు పబ్బు యజమానులతో డైరెక్ట్ గా కాంట్రాక్టు పెట్టుకుని అక్కడ డ్రగ్ పార్టీలను నిర్వహించినట్లు అధికారులు తేల్చారు. ఈ కేసులు ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది.
READ ALSO: AP Cabinet: 200 కంపెనీలకు వైసీపీ తప్పుడు ఇ-మెయిల్స్.. సీఎంకు ఆధారాలు చూపిన మంత్రి పయ్యావుల!
తాజావార్తలు
-
Election Results 2026: తమిళనాడులో హంగ్కే అవకాశం..! 4 రాష్ట్రాలు+UT ఎన్నికల ఫలితాలు.. మినిట్స్ టు మినిట్స్ అప్డేట్స్..
-
Bengal Election Results Live Updates: బెంగాల్ బాద్షా బీజేపీ..! టీఎంసీకి మరో షాక్..! అప్డేట్స్ మీకోసం..
-
Duvvada Madhuri : త్రిష కోరికతో పాటు నా కోరిక కూడా నెరవేరింది
-
Jofra Archer: అద్భుతం.. విజయ్ గెలుపును ముందే ఊహించి ట్వీట్ చేసిన క్రికెటర్ జోఫ్రా ఆర్చర్..
-
Mumbai Indians: ఐపీఎల్లో వరుస ఓటములు.. అయినా ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్…
-
Vijay Dhamu: ఆటో స్టాండ్ నుంచి అసెంబ్లీకి.. రాయపురంలో మాజీ మంత్రి కోటను కూల్చిన సామాన్యుడు!
-
CM Chandrababu : గ్లోబల్ బ్రాండ్లుగా స్థానిక ఉత్పత్తులు.. ఏపీలో ప్రొడక్ట్ పర్ఫెక్షన్ క్లస్టర్లపై చంద్రబాబు సమీక్ష
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!