ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలలో ఒకటైన మహీంద్రా దాని మధ్య-పరిమాణ SUV XUV700 కారుపై భారీ తగ్గింపును అందిస్తోంది. ప్రస్తుతం XUV700 కార్లను పెద్ద సంఖ్యలో విక్రయిస్తుంది. గత కొన్ని నెలలుగా దీని వెయిటింగ్ పీరియడ్ కూడా తగ్గింది. దీని ఎక్స్-షోరూం ధర సుమారుగా రూ. 14 లక్షల నుంచి రూ. 27 లక్షలు ఉంది. కాగా.. SUV విభాగంలో, మహీంద్రా స్కార్పియో-N, స్కార్పియో క్లాసిక్ కాకుండా XUV700, XUV300, తార్(Thar), బొలేరో (Bolero), బొలేరో నియో (Bolero Neo), XUV400 EVలను అందిస్తుంది.
READ MORE: MP Salary: ఎంపీలకు జీతం, ఇతర అలవెన్సులు కలిపి నెలకు ఎంత వస్తుందో తెలుసా?
XUV700పై దానిపై రూ. 1.50 లక్షల వరకు తగ్గింపు ప్రకటించింది మహీంద్రా. ఇటీవలే మహీంద్రా తన AX5 సెలెక్ట్ వేరియంట్ను ప్రీమియం ఫీచర్లతో విడుదల చేసింది. ఈ SUVలో ఏడు సింగిల్టోన్, ఐదు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో 10.24 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ ఉంది. ఇది కాకుండా.. భద్రత కోసం పనోరమిక్ సన్రూఫ్, 3డి సౌండ్ సిస్టమ్, ఎయిర్ ఫిల్టర్, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఉన్నాయి. ఇది పెట్రోల్, డీజిల్ రెండు వేరియెంట్లలో అందుబాటులో ఉంది. ఇది మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వేరియంట్లను కలిగి ఉంది.
మహీంద్రా ఇటీవలే సబ్-కాంపాక్ట్ SUV XUV 3XO ను విడుదల చేసింది. కంపెనీ మే 26 నుంచి డెలివరీని ప్రారంభించింది. దీని ప్రారంభ ధర రూ.7.49 లక్షలు. XUV 3XO కోసం బుకింగ్ మే 15 నుంచి ప్రారంభమైంది. దీని కోసం గంట వ్యవధిలో 50,000కు పైగా బుకింగ్స్ వచ్చాయని కంపెనీ తెలిపింది. XUV 3XO తొమ్మిది వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. అయితే, దీని ఎంట్రీ లెవల్ మరియు టాప్-ఎండ్ వేరియంట్ల డెలివరీ ప్రారంభం కాలేదు.