Mahindra University: మహేంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం.. వైస్ ఛాన్సలర్ ఏమన్నారంటే?
- మహేంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం
- డగ్స్ తీసుకుంటున్న 50 మంది విద్యార్థులను ఈగల్ టీం గుర్తించింది
- యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డా. యజులు మెదురి స్పందించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డ్రగ్స్ మహమ్మారి సమాజాన్ని పట్టి పీడిస్తోంది. డ్రగ్స్ కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ అడ్డుకట్ట పడడం లేదు. డ్రగ్స్ కు అలవాటు పడి యువకులు, విద్యార్థులు తమ జీవితాలను అంధకారం చేసుకుంటున్నారు. నిన్న మహేంద్ర యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. డగ్స్ తీసుకుంటున్న 50 మంది విద్యార్థులను ఈగల్ టీం గుర్తించింది. మహేంద్ర యూనివర్సిటీ విద్యార్థుల నుంచి కిలోకిపైగా గంజాయి, 47 గ్రాముల ఓజీ కుష్ గంజాయి స్వాధీనం చేసుకుంది ఈగల్ టీం. విద్యార్థులు గంజాయిని కొరియర్ ద్వారా తెప్పించుకుంటున్నట్లు గుర్తించారు. ఈ కేసులో మణిపూర్కు చెందిన విద్యార్థి నోవెల్లను అరెస్ట్ చేశారు. ఈ విషయంపై యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డా. యజులు మెదురి స్పందించారు.
Also Read:Gold Rates: పసిడి పరుగులు.. భారీగా పెరిగిన ధరలు.. నేడు తులం ఎంతంటే?
Also Read
మహేంద్రా యూనివర్సిటీలో క్రమశిక్షణ, నిజాయితీ, చట్టాలను గౌరవించే విధంగా అత్యున్నత ప్రమాణాలను పాటిస్తామన్నారు. ఇటీవల నగరవ్యాప్తంగా జరుగుతున్న మత్తు పదార్థాలకు సంబంధించిన దర్యాప్తులో కొంతమంది విద్యార్థుల పేర్లు రావడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. మత్తు పదార్థాల వినియోగం, పంపిణీ చేయడాన్ని యూనివర్శిటీ ఖండిస్తోందన్నారు. మహేంద్రా యూనివర్సిటీలో చట్టాన్ని ఉల్లంఘించే లేదా విద్యార్థుల శ్రేయస్సును హానిచేసే ఏ చర్యలకైనా సున్నా సహనం (Zero Tolerance) విధానం అమలులో ఉంటుందన్నారు. ఈ నియమాలను ఉల్లంఘించిన వారు దోషులుగా తేలితే, విశ్వవిద్యాలయ నిబంధనలు, చట్టప్రకారం కఠినమైన శిక్షలు తప్పవని హెచ్చరించారు.
ప్రస్తుతం జరుగుతున్న పోలీసు దర్యాప్తులో పూర్తిగా సహకరిస్తున్నాము. ఈ సమస్యను త్వరగా పరిష్కరించడానికి పోలీసు శాఖకు అవసరమైన సహాయాన్ని అందిస్తామన్నారు. మా విద్యార్థులందరికీ సురక్షితమైన, బాధ్యతాయుతమైన, క్రమశిక్షణతో కూడిన వాతావరణాన్ని కల్పించడం కోసం కట్టుబడి ఉన్నామన్నారు. మా సంస్థ విలువలు, నైతికతను కాపాడేందుకు కావాల్సిన ప్రతి చర్య తీసుకుంటామన్నారు.
Also Read:Ganesh Chaturthi 2025: వినాయకుడి విగ్రహం పెడుతున్నారా? ఇది మీ కోసమే..
ప్రతి విద్యార్థి అభివృద్ధి చెందేలా సురక్షితమైన, నిబద్ధతతో కూడిన క్యాంపస్ వాతావరణాన్ని కొనసాగించేందుకు మేము కృషి చేస్తున్నామన్నారు. ఒక ఉన్నత విద్యాసంస్థగా మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే ప్రమాదాలు, చట్టపరమైన బాధ్యతలపై విద్యార్థులకు అవగాహన కల్పించే విధానాలు, కార్యక్రమాలను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. విద్యార్థులు బాధ్యతాయుత నిర్ణయాలు తీసుకుని, మహేంద్రా యూనివర్సిటీ విలువలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
US-Iran War: ‘ట్రంప్ను చంపేస్తాం’.. శవపేటికలో అమెరికా అధ్యక్షుడు..ఇరాన్ ప్రచారం..
-
ICC Fined: బిగ్షాక్.. టీమిండియా యువ పేసర్కు భారీ జరిమానా విధించిన ఐసీసీ..
-
Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్కు సెన్సార్ క్లియర్.. ఆ 34 నిమిషాల ఫుటేజ్కూ గ్రీన్ సిగ్నల్!
-
Earthquake: న్యూజిలాండ్లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
-
ISRO: ఇస్రోకు షాక్.. 100 మందికి పైగా శాస్త్రవేత్తలు రాజీనామా.. ఎందుకిలా?
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!