తెలుగు చలనచిత్ర రికార్డులను తిరగరాసి, ఇండియన్ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, టాలీవుడ్ సూపర్స్టార్ మహేష్ బాబు మొదటిసారి జతకడుతున్న అద్భుత దృశ్యకావ్యం ‘వారణాసి’. అత్యున్నత సాంకేతిక విలువల తో, హాలీవుడ్ అడ్వెంచరస్ చిత్రాలకు ఏమాత్రం తీసిపోని విధంగా, భారీ బడ్జెట్తో ఈ సినిమా రూపొందుతోంది. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్లో మహేష్ బాబు మునుపెన్నడూ చూడని సరికొత్త మేకోవర్తో కనిపించబోతున్నారు. ఇందులో మహేష్ బాబు సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ గురించి ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది..
సాధారణంగా సినిమాల్లో షూటింగ్ అయ్యాక విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనులు మొదలవుతాయి. కానీ, జక్కన్న ఈ సినిమా విషయంలో రివర్స్ స్ట్రాటజీ వాడుతున్నారట. గ్లోబల్ లెవెల్లో విజువల్స్ అద్భుతంగా ఉండటం కోసం, టాకీ పార్ట్ కంటే ముందే VFX పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నట్లు సమాచారం. వీరిపై వచ్చే భారీ సీక్వెన్స్లకు సంబంధించి VFX గ్రౌండ్ వర్క్ ఇప్పటికే చాలా వరకు పూర్తయిందని తెలుస్తోంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్.ఎస్. కార్తికేయ, కె.ఎల్. నారాయణ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. సినిమా రిలీజ్ కావడానికి ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ, ఇప్పుడే గ్లోబల్ వైడ్గా ప్రమోషన్స్ చేస్తుండటం సినిమాపై ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోంది.
