Site icon NTV Telugu

Bhopal: కారు కొనే స్థోమతలేక బావమరిది బైక్ తీసుకుని అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే

New Project (25)

New Project (25)

Bhopal: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారత్ ఆదివాసీ పార్టీ (బీఏపీ)కి చెందిన కమలేశ్వర్ దొడియార్ తొలిసారి విజయం సాధించారు. రత్లాం జిల్లాలోని సైలానా నుంచి ఆయన గెలుపొందారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత తొలిసారిగా రాజధాని భోపాల్ చేరుకున్నారు. కమలేశ్వర్ మోటార్ సైకిల్ పై భోపాల్ వచ్చి తన ప్రయాణాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశాడు. ఎమ్మెల్యే అయిన తర్వాత రాష్ట్ర రాజధానికి తన మొదటి పర్యటన కోసం కారు ఏర్పాటు చేయాలని ప్రయత్నించానని, అది తనకు కుదరలేదని చెప్పారు. చివరికి తన బావమరిది మోటార్‌సైకిల్‌ను అరువుగా తీసుకుని, దానిపై ‘ఎమ్మెల్యే’ అని ఉన్న స్టిక్కర్‌ను అతికించి, చలిని ధైర్యంగా ఎదుర్కొని సహోద్యోగితో కలిసి భోపాల్‌కు బయలుదేరానని చెప్పాడు. దాదాపు 330 కిలోమీటర్లు ప్రయాణించి బుధవారం రాత్రి దొడియార్ భోపాల్ చేరుకున్నారు.

Read Also:Fire Accident: హనుమకొండ లో అగ్నిప్రమాదం.. మిషన్ హాస్పిటల్ లో చెలరేగిన మంటలు..

భోపాల్ చేరుకున్నాక ఎమ్మెల్యే రెస్ట్ హౌస్ లో ‘అతిథి’గా బస చేసేందుకు స్థలం దొరికింది. ప్రజాస్వామ్య దేవాలయాన్ని దర్శించుకునేందుకు గురువారం అసెంబ్లీ ముఖద్వారం ముందు పడుకుని ఎమ్మెల్యేగా తన గుర్తింపును అధికారుల ముందు సమర్పించారు. తనది నిరుపేద కూలీ కుటుంబమని, అందుకే నాలుగు చక్రాల వాహనం కొనలేక ప్రజల వద్ద అప్పులు చేసి ఎన్నికల్లో పోటీ చేశానన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి హర్ష్ విజయ్ గెహ్లాట్‌పై 4,618 ఓట్లతో విజయం సాధించిన దోడియార్ ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ చేస్తున్నారు.

Read Also:Devara: డంకీ, సలార్ లతో కలిసి రానున్న దేవర టీజర్…

Exit mobile version