Punjab : ఆ గ్రామానికి శనిలా పట్టుకున్న బట్టల అద్దకం ఫ్యాక్టరీ.. మూడు నెలల్లో 35మంది మృతి
Punjab : పంజాబ్లోని లూథియానాలోని మంగత్ గ్రామ ప్రజలు ఎటువంటి కారణం లేకుండా మరణిస్తున్నారు. మూడు నెలల్లోనే 35 మంది చనిపోయారు. ఈ సమయంలో కూడా డజన్ల కొద్దీ ప్రజలు అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నారు. కలుషిత నీటి వల్లే ఇలాంటి అకాల మరణాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో బట్టల కర్మాగారం నిర్మించినప్పటి నుంచి ఈ పరిస్థితి నెలకొంది. దీనిపై నిరంతరం ఫిర్యాదులు చేస్తున్నా ప్రభుత్వం, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
ఇలాంటి పరిస్థితిలో గ్రామస్తులు నిరసనకు దిగారు. ఫ్యాక్టరీలో బట్టలకు రంగులు వేసే సమయంలో విడుదలయ్యే కెమికల్ వాటర్ ను బోరువెల్ ద్వారా భూగర్భ జలాల్లోకి వదులుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా భూగర్భ జలాలు కలుషితమయ్యాయి. గ్రామంలోని ప్రజలు ఈ నీటిని తాగేందుకు వినియోగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సరైన వైద్యం అందక నిత్యం రోగాలబారిన పడి మృత్యువాత పడుతున్నారని.. ఇదే నీటిని సాగునీటి అవసరాలకు కూడా వినియోగిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో పంటలు కూడా దెబ్బతిన్నాయి.
Also Read
- Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్లైన్స్లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
- Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..
- Kodandaram: మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ చెప్పలేదు, నేను అడగలేదు
- Toxic: అఫీషియల్.. ‘టాక్సిక్’ రిలీజ్ వయిదా..
Read Also:Kodali Nani: వైఎస్ జగన్ ది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం.. న్యాయం చేస్తారు..
పరిస్థితిని పరిశీలిస్తే స్థానిక పాలకవర్గం నుంచి ఎమ్మెల్యే వరకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ ఏమీ చేసేందుకు సిద్ధంగా లేరు. ఎక్కడ చూసినా కేవలం హామీలు మాత్రమే అందాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పరిస్థితిని చూసిన గ్రామస్తులు స్వయంగా పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో గ్రామ నీటి నమూనాను పరీక్షించారు. ఇందులో అన్ని నమూనాలు విఫలమయ్యాయి. దీంతో గ్రామస్తులు సామాజిక కార్యకర్త కుమార్ గౌరవ్తో కలిసి కాలుష్య నియంత్రణ మండలిలో ఫిర్యాదు చేశారు.
ఇప్పుడు బోర్డు అధికారులు నీటి నమూనాలను సేకరించారు. అయితే ఏదైనా చర్య తీసుకునే ముందు ఈ నమూనాల పరీక్ష నివేదికల కోసం వేచి ఉన్నారు. మరోవైపు ఈ విషయమై మంగళవారం నుంచి గ్రామస్తులు కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో చర్మ, కాలేయ వ్యాధుల బారిన పడని వారు ఒక్కరు కూడా లేరన్నారు. ఇప్పటి వరకు 35 మంది చనిపోయారు. వీరిలో 12 మరణాలు క్యాన్సర్ కారణంగా సంభవించాయి. గ్రామం నుంచి నీటి నమూనాలను పంపామని, వాటిని పరీక్షిస్తున్నామని కాలుష్య నియంత్రణ మండలి చీఫ్ ఇంజనీర్ ప్రదీప్ గుప్తా తెలిపారు. విచారణ నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.
Read Also:Election of Two MLC Seats: రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉపఎన్నికకు నోటిఫికేషన్ జారీ
తాజావార్తలు
-
Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్లైన్స్లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
-
IPL Teams Profits: ట్రోఫీ గెలవకపోయినా లాభాలే లాభాలు.. ఐపీఎల్ టీమ్స్ అసలు బిజినెస్ ఇదే, లెక్కలు తెలిస్తే మైండ్ బ్లాకే!
-
Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..
-
MI vs SRH: ముంబైకి చావో రేవో.. నేడు హైదరాబాద్ చేతిలో ఓడిపోతే అంతే సంగతి..
-
Kodandaram: మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ చెప్పలేదు, నేను అడగలేదు
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో