Punjab : ఆ గ్రామానికి శనిలా పట్టుకున్న బట్టల అద్దకం ఫ్యాక్టరీ.. మూడు నెలల్లో 35మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Punjab : పంజాబ్లోని లూథియానాలోని మంగత్ గ్రామ ప్రజలు ఎటువంటి కారణం లేకుండా మరణిస్తున్నారు. మూడు నెలల్లోనే 35 మంది చనిపోయారు. ఈ సమయంలో కూడా డజన్ల కొద్దీ ప్రజలు అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నారు. కలుషిత నీటి వల్లే ఇలాంటి అకాల మరణాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో బట్టల కర్మాగారం నిర్మించినప్పటి నుంచి ఈ పరిస్థితి నెలకొంది. దీనిపై నిరంతరం ఫిర్యాదులు చేస్తున్నా ప్రభుత్వం, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
ఇలాంటి పరిస్థితిలో గ్రామస్తులు నిరసనకు దిగారు. ఫ్యాక్టరీలో బట్టలకు రంగులు వేసే సమయంలో విడుదలయ్యే కెమికల్ వాటర్ ను బోరువెల్ ద్వారా భూగర్భ జలాల్లోకి వదులుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా భూగర్భ జలాలు కలుషితమయ్యాయి. గ్రామంలోని ప్రజలు ఈ నీటిని తాగేందుకు వినియోగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సరైన వైద్యం అందక నిత్యం రోగాలబారిన పడి మృత్యువాత పడుతున్నారని.. ఇదే నీటిని సాగునీటి అవసరాలకు కూడా వినియోగిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో పంటలు కూడా దెబ్బతిన్నాయి.
Also Read
Read Also:Kodali Nani: వైఎస్ జగన్ ది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం.. న్యాయం చేస్తారు..
పరిస్థితిని పరిశీలిస్తే స్థానిక పాలకవర్గం నుంచి ఎమ్మెల్యే వరకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ ఏమీ చేసేందుకు సిద్ధంగా లేరు. ఎక్కడ చూసినా కేవలం హామీలు మాత్రమే అందాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పరిస్థితిని చూసిన గ్రామస్తులు స్వయంగా పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో గ్రామ నీటి నమూనాను పరీక్షించారు. ఇందులో అన్ని నమూనాలు విఫలమయ్యాయి. దీంతో గ్రామస్తులు సామాజిక కార్యకర్త కుమార్ గౌరవ్తో కలిసి కాలుష్య నియంత్రణ మండలిలో ఫిర్యాదు చేశారు.
ఇప్పుడు బోర్డు అధికారులు నీటి నమూనాలను సేకరించారు. అయితే ఏదైనా చర్య తీసుకునే ముందు ఈ నమూనాల పరీక్ష నివేదికల కోసం వేచి ఉన్నారు. మరోవైపు ఈ విషయమై మంగళవారం నుంచి గ్రామస్తులు కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో చర్మ, కాలేయ వ్యాధుల బారిన పడని వారు ఒక్కరు కూడా లేరన్నారు. ఇప్పటి వరకు 35 మంది చనిపోయారు. వీరిలో 12 మరణాలు క్యాన్సర్ కారణంగా సంభవించాయి. గ్రామం నుంచి నీటి నమూనాలను పంపామని, వాటిని పరీక్షిస్తున్నామని కాలుష్య నియంత్రణ మండలి చీఫ్ ఇంజనీర్ ప్రదీప్ గుప్తా తెలిపారు. విచారణ నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.
Read Also:Election of Two MLC Seats: రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉపఎన్నికకు నోటిఫికేషన్ జారీ
తాజావార్తలు
-
Arunodaya Naganna Passes Away : మూగబోయిన విప్లవ గళం.. అరుణోదయ నాగన్న కన్నుమూత.!
-
US Woman Shocked: అమెరికాలో రూ.85 వేలు, భారత్లో రూ.35 మాత్రమే.. మందుల ధరలపై మహిళ షాక్..
-
PM Modi: న్యూజిలాండ్ టూర్కు మోడీ.. 40 ఏళ్లలో తొలి భారత ప్రధానిగా రికార్డ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Falcon Scam : 14 కోట్ల విమానం 3 కోట్లకే.. దేశంలోనే తొలిసారిగా విమానాన్ని ఈ-వేలం.!
ట్రెండింగ్
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!
-
IND vs ENG 2nd T20: సంజును తొలగించకుండా, వైభవ్కు అవకాశం ఇవ్వాలంటే.. ఇదొక్కటే మార్గం!