Odisha Train Accident: మరుభూమిలో ప్రేమ కవితలు… రైలు ట్రాక్ పై డైరీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Odisha Train Accident: ప్రమాదం చిన్నదైనా పెద్దదైనా కచ్చితంగా కొన్ని కథలను మిగుల్చుతుంది. ఒడిశాలోని బాలాసోర్ రైలు ప్రమాదంలో కూడా అలాంటిదే కనిపించింది. ప్రమాదం తర్వాత ఎక్కడ చూసినా ప్రయాణికుల మృతదేహాలు కుప్పలుగా కనిపిస్తున్నాయి. ఏడుస్తున్న ప్రయాణీకుల కళ్లు తమ ప్రజలను చూడాలని తహతహలాడుతున్నాయి. ఇక లోకాన్ని చూడలేక అమాయకులైన ప్రయాణికులు శాశ్వతంగా సైలెంట్ అయిపోయారు. ఈ క్రమంలోనే ట్రాక్లపై పడి ఉన్న కొన్ని పేజీలు, స్కెచ్లు ప్రజల దృష్టిని ఆకర్షించాయి.
Read Also:Maharashtra : ఘోర రోడ్డు ప్రమాదం..బస్సును ఢీ కొట్టిన కారు.. ఐదుగురు మృతి..
Also Read
- Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
- 8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
- LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
- Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
డైరీలో కవితలు వ్రాసిన చాలా పేజీలు ట్రాక్లపై పడి ఉన్నాయి. ఈ పద్యాలు బెంగాలీ భాషలో ఉన్నాయి.పూవులు, ఏనుగు, చేప బొమ్మలు, అంతా సహజత్వం పెనవేసుకున్న డైరీ విప్పుకుని కనిపించింది. బెంగాలీ భాషలో రాసిన ప్రేమ కవితలు అందులో నిక్షిప్తమై ఉన్నాయి. ‘చెదురుమదురుగా కనిపించే మేఘాలు సన్నటి వర్షాన్ని కురిపిస్తాయి. మనం వినే చిట్టి కథలే మనలో ప్రేమను వికసింపజేస్తాయి’ అంటూ స్వదస్తూరితో రాసిన కవిత చదివిన వారి గుండెను పిండేస్తుంది. ‘ప్రేమవై నీవు నాకు ఎల్లప్పుడూ కావాలి, నా మనసులో నీవెప్పుడూ ఉంటావు’ అంటూ మరో కవిత ఉన్నది. ఈ డైరీ ఫొటోలు సోషల్ మీడియాకు ఎక్కాయి. జీవితం ఎంత చంచలమైందో కదా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Read Also:NTR: దేవర టైటిల్ కి ఏజెంట్ పాత్రకి అసలు సంబంధం ఉందా బాసూ?
Just 2 days back, there was a train accident in Balasore, India.
Too many died and a lot more had serious injuries.
A bundle of love letters and poems were found amongst the debris on the tracks.
A glimpse of a lost romance. A rarity in this age.
Give this post a read. pic.twitter.com/MHUq8LplyD
— Chandra Bhushan Shukla (@shuklaBchandra) June 4, 2023
ఎవరి డైరీ? ఎవ్వరికి తెలియదు
ఈ కవితలు ఎవరు రాశారు, ఎవరి డైరీ యాత్రికుడికి సంబంధించినది అనే సమాచారం ఇంకా తెరపైకి రాలేదు. అంతేకాక ఇప్పటివరకు ఎవరూ వాటికోసం అడగలేదు. ఒక వేళ అడిగితే అప్పుడు ఇచ్చేందుకు పోలీసు అధికారులు పేజీలను భద్రపరిచారు. ఇలాంటి అనేక ఇతర విషయాలు తమలో తాము కథను చెప్పుకునే ట్రాక్లపై పడి ఉన్నాయి. ఒడిశాలోని బాలాసోర్లో శుక్రవారం జరిగిన రైలు ప్రమాదంలో 275 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా, 1000 మందికి పైగా గాయపడ్డారు. వేగంగా వెళ్తున్న కోరమాండల్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంతో దాని బోగీలు లూప్ లైన్పై నిలబడి ఉన్న గూడ్స్ రైలును ఢీకొనడంతో, రైలు వెనుక భాగం అటుగా వెళ్తున్న యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
తాజావార్తలు
-
Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
-
Ramayana Release Date : రామాయణ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్..
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
Donald Trump: ట్రంప్ సంచలన ప్రకటన.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరగబోయే అతిపెద్ద దాడికి మేము సిద్ధంగా ఉన్నాం
ట్రెండింగ్
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!