NTV Telugu Site icon

Live Heart Attack: విలేకరుల సమావేశం నిర్వహిస్తుండగా ఆకస్మికంగా గుండెపోటు.. చివరకి.?

Heart Attack

Heart Attack

Live Heart Attack: కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రెస్ క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ కాంగ్రెస్ నాయకుడు మరణించారు. మృతి చెందిన నాయకుడిని రవి చంద్రన్‌గా గుర్తించారు. లాల్ మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆయన ఉన్నారు. ముడా కుంభకోణంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మద్దతు తెలిపేందుకు చంద్రన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. కురుబర సంఘం అధ్యక్షుడు, కోలారు జిల్లాకు చెందిన రవిచంద్రన్‌ కు హఠాత్తుగా గుండెపోటు వచ్చి అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఈ మొత్తం ఘటనను కెమెరాలో బంధించగా, సదస్సు జరుగుతున్న సమయంలోనే కాంగ్రెస్ నాయకుడు నేలపై పడిపోయాడు. వెంటనే కన్నింగ్‌ హామ్ రోడ్‌ లోని ఫోర్టిస్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ, అక్కడికి చేరుకోగానే అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.

కాంగ్రెస్ నేత మృతి పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ప్రాసిక్యూట్ చేయడానికి కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ శనివారం ఆగస్టు 17న అనుమతి ఇచ్చారు. న్యాయవాది టీజే అబ్రహం, కార్యకర్తలు స్నేహమోయీ కృష్ణ, ప్రదీప్‌లు మూడు పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ నిర్ణయంపై సిద్ధరామయ్య ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది.

ఈ క్రమంలో కాంగ్రెస్ నేత సీకే రవిచంద్రన్ ప్రెస్ తో మాట్లాడుతుండగానే.. ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యారు. దీంతో కుర్చీ మీద నుంచి కిందపడిపోయారు. పక్కనఉన్నవాళ్లు అలర్ట్ అయ్యేలోపు సంఘటన స్థలంలోనే లైవ్‌ లో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.