Laxman vs Harsha Bhogle: హర్షా భోగ్లేపై ఆగ్రహంతో ఊగిపోతున్న క్రికెట్ ఫ్యాన్స్.. ‘ముంబై ఫ్రీక్స్’ అంటూ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ సీజన్ లో భాగంగా తాజాగా జరిగిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ ఇద్దరు మాజీ భారత దిగ్గజాల మధ్యకు గొడవకు దారి తీసింది. ఈ గొడవలో ప్రముఖ కామెంటరీ హర్షా భోగ్లే, మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ సోషల్ మీడియా వేదికగా వాగ్వేదానికి పెళ్లయిపోయారు. ఆ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేయగా చివర్లో ధోని సంచలాత్మపక ఇన్నింగ్స్ కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లను కోల్పోయి 206 పరుగులను చేయగలిగింది. అయితే చెన్నై ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత అందుకు సంబంధించి హర్షా భోగ్లే తన ట్విట్టర్ ఖాతా ద్వారా చెన్నైను లక్ష్యంగా చేసుకొని ఈ స్కోర్ సరిపోదు అంటూ అభిప్రాయపడ్డాడు. నిజానికి ప్రతి మ్యాచ్ కు హర్ష ఇలానే స్పందిస్తుంటాడు. ఇదే సాంప్రదాయాన్ని కూడా మరోసారి అతను కొనసాగించాడు.
Also Read: Pushpa 2 : నేటి నుంచి థియేటర్స్ లోకి వచ్చేస్తున్న పుష్ప 2 టీజర్..!!
Also Read
నిజానికి 206 పరుగుల లక్ష్యం నిజంగా మంచిదే. కాకపోతే ఈ పిచ్ పై ఏమాత్రం ఈ స్కోరు సరిపోదని.., డ్యూ ప్రభావంతో పాటు ఎక్కువగా బౌలింగ్ ఆప్షన్స్ లేని చెన్నై సూపర్ కింగ్స్ మరో 20 పరుగులు అదనంగా చేసి ఉంటే బాగుండేది అంటూ హర్ష ట్వీట్ చేశాడు. అయితే ఈ పోస్ట్ ను ఆధారంగా చేసుకుని తమిళనాడు మాజీ క్రికెటర్ టీమిండియా మాజీ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణ హర్షా భోగ్లేపై తీవ్రంగా స్పందించాడు. మీరంతా ఎప్పుడు చెన్నై జట్టును తక్కువ చేసేందుకు ఇష్టపడతారని.. మీరు ఇలాంటి ఆటలు నాతో ఆడండి.. చెన్నై సూపర్ కింగ్స్ తో కాదని “ముంబై ఫ్రిక్స్” అంటూ ఘాటుగా స్పందించాడు. దీంతోపాటు అసలు నువ్వు ఎలా కామెంట్రేటర్ అయ్యావా అంటూ.. ఇన్నాళ్లు భారతదేశ క్రికెట్ లో నిన్ను ఎలా కొనసాగిస్తున్నారో అర్థం కావట్లేదని అన్నారు శివరామకృష్ణన్.
Also Read: Jagan Memantha Siddam: నేడు ‘మేమంతా సిద్ధం’ యాత్ర ఇలా సాగనుంది..!
ఇకపోతే ఈ విషయం సంబంధించి హర్షా భోగ్లే ఎటువంటి రిప్లై ఇవ్వకపోవడం కొసమెరుపు. అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ఏమైందో ఏమో తెలియదు కానీ., లక్ష్మణ్ శివరామకృష్ణ తాజాగా ఈ రెండు ట్వీట్స్ ను తొలగించాడు. అయితే అప్పటికే ఇందుకు సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇకపోతే ఈ మ్యాచ్ లో చెన్నై 20 పరుగుల తేడాతో విజయం సాధించగా.. దాంతో హర్షా భోగ్లే చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ మాత్రం అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి హర్ష కాస్త ద్వంద బుద్దిని ఆవిలంబిస్తున్నట్లు అర్థమవుతోంది. దీని కారణం.. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ సెంచరీ సాధించిన అతడిపై వన్డే బ్యాటింగ్ అంటూ విమర్శలను గుప్పించాడు. ఇక అదే తరహాలో రోహిత్ శర్మ చేసిన సెంచరీని మాత్రం.. మరోవైపు రోహిత్ శర్మకు ఎవరైనా సహకారం అందించుంటుంటే అతడు మ్యాచ్ ను గెలిపించేవాడు అంటూ కామెంట్స్ చేశాడు. దీంతో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కూడా హర్షపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
-
Sankranti 2027: అనిల్ రావిపూడికి ఈసారి టఫ్ ఫైట్.. 2027 సంక్రాంతి బరిలో బిగ్ వార్!
-
Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
-
Bhatti Vikramarka : బొగ్గు దాటి బంగారం, రాగిపై సింగరేణి ఫోకస్.. భట్టి కీలక ఆదేశాలు
-
Toxic Makers: ‘ధురంధర్ 2’కు షాకిచ్చిన ‘టాక్సిక్’.. ఫ్యాన్స్కు మేకర్స్ కీలక విజ్ఞప్తి
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..