Singareni Elections: సింగరేణి ఎన్నికల్లో పాగా వేయటానికి పావులు కదుపుతున్న కార్మిక సంఘాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సింగరేణి లో గుర్తింపు కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికల్లో పాగా వేయటానికి అటు ఏఐటీయూసీ ఇటు ఐఎన్టీయూసీ పావులు కదుపుతున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్- సీపీఐ పార్టీల అనుబంధ సంఘాలు ఐక్యంగా పోరాడి ఓటమి పాలయ్యారు. అయితే గత రెండు సార్లుగా టీఆర్ఎస్ అనుబంధ సంస్థ టీబీజీకేఎస్ గెలుపొందుతూ మూడోసారి హ్యాట్రిక్ కొట్టడానికి ప్రయత్నాలు చేసింది. కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం తమ కార్మిక నాయకులకి షాక్ ఇచ్చింది. టీఆర్ఎస్ పార్టీ సింగరేణి ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం చేసుకోవడంతో ఆ పార్టీ అనుబంధ సంఘానికి నాయకులైన టీబీజీకేఎస్ నాయకత్వం అంత కూడా ఇప్పుడు కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీలో చేరటానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర రాజధానిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచర గణంతో చర్చలు జరుపుతుంది.
Read Also: Prashanth Neel: కింగ్ ఖాన్ పైన పగబట్టి.. గురి చూసి కొట్టినట్టుందే!
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ఇక, టీబీజీ కేఎస్ కు సంబంధించిన నాయకత్వం అంత కూడా ఇప్పుడు హైదరాబాద్ లో ఉంది. అయితే టీబీజీకేస్ నాయకత్వం మొత్తం గతంలో కాంగ్రెస్ అనుబంధం ఐఎన్టీయుసీలో ఉన్నవారే.. వారంతా టీబీజీకేఎస్ లో చేరి ఆ సంఘాన్ని బలోపేతం చేశారు. రెండు సార్లు గుర్తింపు సంఘంగా గెలుపొందడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు టీబీజీకేఎస్ గుర్తింపు ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం చేసుకోవడంతో ఆ సంస్థ నాయకత్వానికి రాజీనామా చేసిన ఆ సంఘం నాయకులు వెంకట్రావు, రాజిరెడ్డి, మల్లయ్యలు కాంగ్రెస్ లో చేరటానికి రెడీ అయ్యారు. కొత్తగూడెంకు సంబంధించిన పలువురు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సమావేశమయ్యారు.. వీరందరూ కూడా పొంగులేటి సహకారంతో ఐఎన్టీయూసీలో చేరటానికి ప్లాన్ చేసుకుంటున్నారు.
Read Also: Balakrishna: రంగంలోకి దిగిన బాలయ్య.. రెండు రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటన
అయితే, టీబీజికేఎస్ కు సంబంధించిన అగ్ర నాయకత్వం అంత కూడా ఐఎన్టిసీలో చేరటానికి సిద్ధం అవుతుండగా.. సీపీఐ అనుబంధ సంస్థ ఏఐటీయూసీ మాత్రం మైన్స్ మీద దృష్టి సారించింది. అసలైన ఓటర్లు ఎక్కడున్నారో వారి దగ్గరికి వెళ్లి అక్కడ టీబీజీకేఎస్ కు సంబంధించిన క్రిందిస్థాయి నాయకత్వంపై దృష్టి సారించింది. క్రింద క్యాడర్ నాయకత్వాన్ని తమ సంస్థలో చేర్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!