Singareni Elections: సింగరేణి ఎన్నికల్లో పాగా వేయటానికి పావులు కదుపుతున్న కార్మిక సంఘాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సింగరేణి లో గుర్తింపు కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికల్లో పాగా వేయటానికి అటు ఏఐటీయూసీ ఇటు ఐఎన్టీయూసీ పావులు కదుపుతున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్- సీపీఐ పార్టీల అనుబంధ సంఘాలు ఐక్యంగా పోరాడి ఓటమి పాలయ్యారు. అయితే గత రెండు సార్లుగా టీఆర్ఎస్ అనుబంధ సంస్థ టీబీజీకేఎస్ గెలుపొందుతూ మూడోసారి హ్యాట్రిక్ కొట్టడానికి ప్రయత్నాలు చేసింది. కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం తమ కార్మిక నాయకులకి షాక్ ఇచ్చింది. టీఆర్ఎస్ పార్టీ సింగరేణి ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం చేసుకోవడంతో ఆ పార్టీ అనుబంధ సంఘానికి నాయకులైన టీబీజీకేఎస్ నాయకత్వం అంత కూడా ఇప్పుడు కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీలో చేరటానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర రాజధానిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచర గణంతో చర్చలు జరుపుతుంది.
Read Also: Prashanth Neel: కింగ్ ఖాన్ పైన పగబట్టి.. గురి చూసి కొట్టినట్టుందే!
Also Read
- Himmat Singh: అరెరె.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
- Rahul Gandhi: ఢిల్లీలో గళం.. రాంచీలో మౌనం.. విద్యార్థులపై రాహుల్ గాంధీ కపట ప్రేమ?
- 50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
- YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
ఇక, టీబీజీ కేఎస్ కు సంబంధించిన నాయకత్వం అంత కూడా ఇప్పుడు హైదరాబాద్ లో ఉంది. అయితే టీబీజీకేస్ నాయకత్వం మొత్తం గతంలో కాంగ్రెస్ అనుబంధం ఐఎన్టీయుసీలో ఉన్నవారే.. వారంతా టీబీజీకేఎస్ లో చేరి ఆ సంఘాన్ని బలోపేతం చేశారు. రెండు సార్లు గుర్తింపు సంఘంగా గెలుపొందడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు టీబీజీకేఎస్ గుర్తింపు ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం చేసుకోవడంతో ఆ సంస్థ నాయకత్వానికి రాజీనామా చేసిన ఆ సంఘం నాయకులు వెంకట్రావు, రాజిరెడ్డి, మల్లయ్యలు కాంగ్రెస్ లో చేరటానికి రెడీ అయ్యారు. కొత్తగూడెంకు సంబంధించిన పలువురు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సమావేశమయ్యారు.. వీరందరూ కూడా పొంగులేటి సహకారంతో ఐఎన్టీయూసీలో చేరటానికి ప్లాన్ చేసుకుంటున్నారు.
Read Also: Balakrishna: రంగంలోకి దిగిన బాలయ్య.. రెండు రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటన
అయితే, టీబీజికేఎస్ కు సంబంధించిన అగ్ర నాయకత్వం అంత కూడా ఐఎన్టిసీలో చేరటానికి సిద్ధం అవుతుండగా.. సీపీఐ అనుబంధ సంస్థ ఏఐటీయూసీ మాత్రం మైన్స్ మీద దృష్టి సారించింది. అసలైన ఓటర్లు ఎక్కడున్నారో వారి దగ్గరికి వెళ్లి అక్కడ టీబీజీకేఎస్ కు సంబంధించిన క్రిందిస్థాయి నాయకత్వంపై దృష్టి సారించింది. క్రింద క్యాడర్ నాయకత్వాన్ని తమ సంస్థలో చేర్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది.
తాజావార్తలు
-
Himmat Singh: అరెరె.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
Rahul Gandhi: ఢిల్లీలో గళం.. రాంచీలో మౌనం.. విద్యార్థులపై రాహుల్ గాంధీ కపట ప్రేమ?
-
ASUS Chromebook CX15: ఆసుస్ క్రోమ్బుక్ CX15 భారత్లో లాంచ్.. Google AI ఫీచర్లు, మిలిటరీ-గ్రేడ్ డ్యురబిలిటీ.. చౌక ధర
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
ట్రెండింగ్
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!