Site icon NTV Telugu

Koti deepotstavam 6th Day : కమనీయం..రమణీయం తిరుమల శ్రీనివాస కల్యాణం, కొల్హాపూర్ మహాలక్ష్మీ అనుగ్రహం

Koti Deepotsavam

Koti Deepotsavam

భక్తి టీవీ కోటిదీపోత్సవం వైభవంగా సాగుతోంది. ఎన్టీవీ-భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి దీపోత్సవం ఆరవ రోజు ఘనంగా ముగిసింది. నవంబర్‌ 14న ప్రారంభమైన కోటి దీపోత్సవ మహోత్సవం మహోద్యమంగా కొనసాగుతోంది. ఆ కైలాసమే ఇలకి దిగివచ్చిందా అనేలా.. కోటిదీపోత్సవ వేదికను ముస్తాబు చేశారు. ఒక్కసారైనా కోటిదీపోత్సవానికి వెళ్లాలి అనేలా భక్తులలో ఉత్సాహాన్ని కలిగిస్తోంది. ఇల కైలాసంగా మారిపోయిన ఎన్టీఆర్‌ స్టేడియం శివనామస్మరణతో మార్మోగుతోంది. ఆరవ రోజు కోటి దీపోత్సవం వేదికైన ఎన్టీఆర్ స్టేడియం పరిసర ప్రాంతాలు శివనామస్మరణతో మార్మోగాయి. ముందుగా శ్రీ సిద్దేశ్వరీ పీఠం, కుర్తాళంకు చెందిన శ్రీసిద్దేశ్వరానంద భారతి స్వామీజీ వారితో అనుగ్రహ భాషణం. ఉత్సవంలో భాగంగా బెంగళూరు కైలాసాశ్రమ పీఠాధిపతి శ్రీ జయేంద్రపురి మహాస్వామిజీ గారిచే అనుగ్రహభాషణం. తిరుపతి శక్తిపీఠం మాతా రమ్యానందభారతి గారిచే ఆశీర్వచనం. అనంతరం భక్తులచే గోవిందనామస్మరణ పూజ నిర్వహించారు. ప్రాంగణంలోకి కంచి కామాక్షి అమ్మవారికి & కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారికి ఆహ్వానం. ఆ తర్వాత కన్నుల పండుగగా తిరుమల శ్రీనివాస కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వెనువెంటనే పల్లికి వాహనంపై అమ్మవార్లతో కలిసి శ్రీనివాసులు భక్తులకు దర్శనమిచ్చారు. కోటిదీపాల వెలుగులు, సప్తహారతుల కాంతులు.. స్వర్ణలింగోద్భవ వైభవాన్ని భక్తులు తిలకించి తరించిపోయారు. మహాదేవునికి మహానీరాజనంతో పాటు అద్భుత సాంస్కృతిక కార్యక్రమాలతో ఆరవ రోజు కోటి దీపోత్సవ వేడుక విజయవంతంగా ముగిసింది. ఆరవ రోజు పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో.. కోటిదీపోత్సవ వేదిక జనసంద్రంగా మారిపోయింది. అంతేకాకుండా.. దీపాలను వెలిగించి భక్తులు తమ భక్తిని చాటుకున్నారు. పిల్లా, పెద్ద అని తేడా లేకుండా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ మహాదేవుని ఆశీస్సులు పొందారు.

ఇదిలా ఉంటే.. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి 9.30 వరకు ఎన్టీఆర్ స్టేడియం దీపాల కాంతులతో వెలిగిపోయింది. చూడటానికి ఎంతో అందంగా అద్భుతంగా అనిపించింది. మరోవైపు భక్తి టీవీ కోటిదీపోత్సవంలో పాల్గొనే భక్తులకు పూజాసామగ్రి, దీపారాధన వస్తువులను రచనా టెలివిజన్‌ పక్షాన పూర్తి ఉచితంగా అందించింది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా భక్తి టీవీ ఈ దీప మహాయజ్ఞాన్ని నిర్వహిస్తూ వస్తుంది.. ఈ నెల 14 నుంచి 27వ తేదీ వరకు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో కోటిదీపోత్సవం జరగనుంది.. అయితే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆ మహాశివుడి అనుగ్రహం పొందాలని భక్తి టీవీ ఆహ్వానం పలుకుతోంది. కార్తిక మాసం, నాగుల చవిత వేళ.. కోటిదీపోత్సవంలో పాల్గొనండి.. ఆ మహాదేవుడి కృపకు పాత్రులుకండి..

 

Exit mobile version